Ganta Srinivasa Rao: వైసీపీ తీరుపై ఈసీకి లేఖ రాస్తా: గంటా శ్రీనివాసరావు.

0
137

ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే

చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా

 

ఉనికి కాపాడుకోవడానికి దిగజారుడు వ్యాఖ్యలంటూ ఫైర్

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన మురికి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేతపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో గంటా మీడియాతో మాట్లాడారు. వైసీపీ చీఫ్ జగన్ సహా ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అసభ్య వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు.

 

వైసీపీ నేతల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఉనికిని కాపాడుకునేందుకే అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, కులాలను ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని లేఖ రాయనున్నట్లు తెలిపారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అసెంబ్లీలో క్షమాపణ చెప్పారని గంటా శ్రీనివాసరావు గుర్తుచేశారు. చంద్రబాబును ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల్లో ఆగ్రహం ఉంటుందని, వైసీపీ హయాంలోనే జగన్ ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నారని గంటా శ్రీనివాసరావు చెప్పారు.

Search
Categories
Read More
Telangana
డ్రంకెన్ డ్రైవ్ స్వీయపర్యవేక్షణ లో హైదరాబాద్ C.P. సజ్జనర్ IPS.|
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌...
By Sidhu Maroju 2025-12-25 08:07:31 0 267
Telangana
మంచిర్యాల: మెడికల్ షాపులు బంద్
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ భాగంగా ప్రజలు తమకు సహకరించాలని మంచిర్యాల్ మెడికల్ డ్రాగెస్ట్...
By Bonagiri RaviShankar 2026-05-20 04:38:22 0 166
Andhra Pradesh
ఉగాది నాటికి 7,187 ఇళ్లు పూర్తి కావాలి
జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి...
By Boiena Rajesh 2026-02-27 02:19:46 0 179
Telangana
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ  ఎల్...
By Sadaq Sadaq 2026-02-24 17:15:59 0 202
Andhra Pradesh
పుంగనూరు: శాంతినగర్లో లోపించిన పారిశుధ్యం
అన్నమయ్య జిల్లా , పుంగనూరు మండలం, భీమగాని పల్లి పంచాయతీ, శాంతినగర్ లో గత కొన్ని రోజులుగా కాలువలలో...
By Kothuru Murali 2026-05-14 13:14:39 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com