L Subbarayudu: తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలు.

0
113

ఈ నెల 28వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందన్న ఎస్పీ సుబ్బరాయుడు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

 

సభలు, ఊరేగింపులకు తప్పనిసరిగా లిఖితపూర్వక అనుమతి పొందాలని సూచన

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ - 30ను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఒక నెల కాలవ్యవధికి అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని పోలీసు శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 

 

ఫిబ్రవరి నెలలో తిరుపతి జిల్లా పరిధిలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభల నిర్వహణపై నియంత్రణలు అమల్లో ఉంటాయి. ప్రజా ప్రదేశాల్లో సభలు లేదా ఊరేగింపులు నిర్వహించదలచిన వారు తప్పనిసరిగా ముందస్తుగా సంబంధిత అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. దరఖాస్తులో సభ లేదా ర్యాలీ నిర్వహించే ప్రదేశం, తేదీ, సమయం వంటి వివరాలు స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి మంజూరు చేసిన అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం పోలీసు శాఖకు ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. అయితే వివాహాలు, అంత్యక్రియలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని తెలిపారు. 

 

ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై పోలీస్ యాక్ట్ -1861తో పాటు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు, సంఘాలు, సంస్థలు ఈ ఆదేశాలను గౌరవించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు తాటిమకుల పాలెం అటవీ క్షేత్రాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
పుంగనూరు అటవీ క్షేత్ర కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పాలెంపల్లి గ్రామ సమీపంలో...
By Kothuru Murali 2026-01-26 07:11:18 0 151
Telangana
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-03-19 03:06:36 0 189
Telangana
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది....
By Veeresh Kumar 2026-04-01 04:50:33 0 357
SURAKSHA
Bengaluru & Chennai: India’s Champions of Women’s Inclusivity!
  Huge news for South India! 🌟 The 2025 "Top Cities for Women in India" (TCWI) report by...
By Venugopal Gopal 2026-01-09 05:01:03 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com