నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం

0
77

*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*

  ***************************

మంగళగిరి మిద్దె సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్థానిక మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాల వంటకాల తయారీ ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు మాట్లాడారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవం రోజున ప్రారంభించి రథోత్సవం వరకు తొమ్మిది రోజులు పాటు స్వామివారి ఉత్సవ ఊరేగింపు మిద్దె సెంటర్ చేరుకున్న సమయంలో భక్తులకు ట్రస్ట్ ప్రసాదాలు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు గాలి ప్రతాపరెడ్డి, జంజనం దినేష్, పణిదపు భాను ప్రసాద్, పంచల రామచంద్రరావు, దామర్ల వీరప్రసాద్, పణిదపు శోభన్, వెంకటేష్, అర్చక స్వామి దగ్గుపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Search
Categories
Read More
Andhra Pradesh
అప్రెంటిస్ ఖాళీలు !!
కర్నూలు :  యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
By Hari Krishna 2025-12-24 14:44:23 0 160
Andhra Pradesh
సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ...
By Mobbu Venkatramana 2026-03-02 12:59:37 0 173
Andhra Pradesh
మదనపల్లెలో అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభం.
మదనపల్లె పట్టణంలో సోమవారం అన్సర్ (65) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొంబూవీధికి...
By Pagadala Venkateswar 2026-03-24 03:33:00 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com