మైనంపల్లి సహకారంతో అభివృద్ధి దిశగా మచ్చ బొల్లారం.|

0
120

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ముందడుగు పడింది. సెలెక్ట్ టాకీస్ నుండి మచ్చ బొల్లారం వాటర్ ట్యాంక్ వరకు తీవ్రంగా దెబ్బతిన్న బిటి (BT) రోడ్డు అభివృద్ధి పనుల కోసం ₹238 లక్షల నిధులను జిహెచ్ఎంసి(GHMC) స్టాండింగ్ కమిటీ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 

నిరంతర కృషితో నిధుల మంజూరు :

గత ఏడాది ఆగస్టు 2025 లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మద్దతుతో, డివిజన్ ల్లోని సీసీ రోడ్లు, బీటీ రోడ్ల అభివృద్ధిపై జిహెచ్ఎంసి కమిషనర్ కు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ సమగ్ర వినతి పత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనలను సాంకేతిక బృందం పరిశీలించిన అనంతరం, జనవరి 21న జనరల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి, జనవరి 29న తుది ఆమోదం తెలిపారు.

సెలెక్ట్ టాకీస్ నుండి వాటర్ ట్యాంక్ వరకు ఉన్న ఈ రహదారి నివాస కాలనీలను కొంపల్లి- బొల్లారం హైవేను మరియు రైల్వే స్టేషన్ ను కలిపే అత్యంత కీలక దారి. రహదారి దెబ్బతినడం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిధులు కేటాయించారు.

ఈ అభివృద్ధి పనులకు సహకరించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లకు స్టాండింగ్ కమిటీ సభ్యులకు, కార్పొరేటర్  రాజ్ జితేంద్రనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం మిగతా ప్రతిపాదనలను కూడా మైనంపల్లి సూచనలతో త్వరలోనే మంజూరు చేయిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Punjab
Punjab’s Big Push for Early Childhood Development: 1,419 New Anganwadi Centres, Tech Integration, and More
Chandigarh:  The Punjab government, under the leadership of Chief Minister Bhagwant Singh...
By BMA ADMIN 2025-05-20 08:10:58 0 2K
Andhra Pradesh
Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం చంద్రబాబు.
Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం   andhra Chandrababu reviews...
By Pagadala Venkateswar 2026-02-04 07:57:42 0 97
Andhra Pradesh
చేనేతల ద్రోహి మాజీ ఎంపీ బుట్టా రేణుక
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర రాజకీయాలు...
By Boya Dasthagiri 2026-04-04 03:32:18 0 74
Andhra Pradesh
బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు నందు కరస్పాండెంట్ యస్.షాషావలి ఆధ్వర్యంలో
గూడూరు నందు కరస్పాండెంట్ యస్.షాషావలి ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం...
By mahaboob basha 2025-11-14 14:44:11 0 182
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com