పెట్రోల్‌ ఉచితంగా పంచుతోన్న హైదరాబాదీ.. ‘భాయ్, భారత్ మాతా కీ జై అనొద్దు ఇక్కడ’.. వీడియో వైరల్

0
179

దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదే పదే చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉంటున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వందలాది వాహనాలు క్యూలో ఉంటున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. వాహనదారులంతా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటుడటంతో.. బంకుల్లోని పెట్రోల్ గంటల వ్యవధిలోనే అయిపోతోంది. దీంతో మరింత ఆందోళన చెందుతోన్న జనం.. పెట్రోల్ కోసం బంకుల ముందు ఎగబడుతున్నారు.

‎ఇలాంటి పరిస్థితుల్లో సయద్ అయుబ్ అనే హైదరాబాదీ ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. చెరకు రసం విక్రయించే బాటిళ్లలో పెట్రోల్ నింపి ఆటోడ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లాంటి వారికి ఫ్రీగా అందిస్తున్నారు. అయితే ఓ పెట్రోల్ బంకు వద్ద ఆయన ఉచితంగా పెట్రోల్‌ను అందించే క్రమంలో కొందరు భారత్ మాతా కీ జై అని నినాదాలు చేశారు. దీనికి స్పందించిన అయూబ్.. ‘భాయ్, భారత్‌ మాతా కీ జై లాంటి నినాదాలు చేయకండి. భారతదేశానికి సమస్య వచ్చినప్పుడు, అండగా ఉండటంలో భారతీయ ముస్లింలు ఎప్పుడూ ముందే ఉంటున్నారు. మీరు ఇలా చేయకండి, మతాన్ని ఇందులోకి తీసుకురాకండి. ఇక్కడ హిందువులు, ముస్లింలంతా ఒక్కటే’’ అని అయూబ్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రతికూలంగా స్పందిస్తున్నారు. భారత్ మాతా కీ జై మతపరమైన నినాదం అంటే.. వంద రూపాయల పెట్రోల్ కోసం.. నినాదాలు చేయడం ఆపేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో అలాంటి నినాదాలు చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

‎ఎవరీ అయూబ్..?సయద్ అయూబ్ హైదరాబాద్ యూత్ కరేజ్ (హెచ్‌వైసీ) అనే సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తుంటారు. ఆహరం పంపిణీ, ఉచితంగా పెట్రోల్ పంచడం, గాజా బాధితులకు సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. హెచ్‌వైసీ సంస్థ హైదరాబాద్‌లో కిస్మత్‌పుర నుంచి ఈ కార్యక్రమాలను చేపడుతోంది. క్రౌడ్ ఫండింగ్ నిధుల విషయంలో మోసం జరిగిందనే ఆరోపణలతో సైదాబాద్ పోలీసులు గతంలో అయూబ్‌‌తోపాటు సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

‎ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు ఫ్రీగా పెట్రోల్..

‎అయూబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలను పరిశీలిస్తే.. గత రెండు రోజులుగా ఆయన ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నారని అర్థమవుతోంది. ‘‘పెట్రోల్ బంకుల వద్ద భారీ సంఖ్యలో జనం ఉంటున్నారు.. చాలా మంది పెట్రోల్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. దీంతో పెట్రోల్ కొట్టించుకోవడం చాలా కష్టంగా మారింది.. దీని వల్ల డెలివరీ బాయ్స్ లాంటి వారిపై ప్రభావం పడుతోంది.. అందుకే మేము ఫ్రీ పెట్రోల్ డ్రైవ్ మొదలుపెట్టాం. రెండు రోజులుగా మేము ఇలా చేస్తున్నాం. రాత్రి సమయాల్లో బంకులు మూతపడుతున్నాయి. 3-4 రోజుల్లో విక్రయించే పెట్రోల్‌‌ను 3-4 గంటల్లోనే విక్రయిస్తున్నామని.. అందుకే మేం బంకులు మూసేస్తున్నామని పెట్రోల్ బంక్ యాజమానులు చెబుతున్నార’’ని సయద్ అయుబ్ వెల్లడించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణ
కాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం...
By Ratna Sekhar 2026-02-19 18:49:04 0 344
Andhra Pradesh
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ...
By Benguluri Madhubabu 2026-04-06 10:32:39 0 204
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 3K
Andhra Pradesh
చింతూరులో వీధి కుక్కల బీభత్సం.
చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు...
By Shyamala Yadagiri 2026-05-10 11:37:21 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com