కేసిఆర్ విచారణకు సర్వం సిద్ధం- నంది నగర్ చేరుకున్న గులాబీ బాస్ .|

0
53

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సిద్ధమయ్యారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న విచారణ కోసం ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ నుండి బయలుదేరి బంజారాహిల్స్ లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు.

 

కేసీఆర్ ఎర్రవల్లి నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకునే వరకు దారి పొడుగునా బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసిఆర్ కు సంఘీభావం తెలుపుతూ జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కాన్వాయి వెంట ర్యాలీగా వచ్చారు. కెసిఆర్ పట్ల జరుగుతున్న విచారణను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది.

 

విచారణ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నంది నగర్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.  

 

నంది నగర్ నివాసంలోనికి కేవలం కుటుంబ సభ్యులు, న్యాయానిపుణులను మాత్రమే అనుమతిస్తున్నారు.   

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినందుకు సిట్ అధికారులు కేసిఆర్ ను ప్రశ్నించనున్నారు. అంతకుముందు సిట్ అధికారులు ఎర్రవల్లికి రావాలని కేసీఆర్ కోరగా, సాంకేతిక కారణాల దృష్ట్యా సిట్ దానిని తిరస్కరించి అధికారుల రికార్డుల్లో ఉన్న నంది నగర్ లో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.  

బాధ్యతాయుతమైన పౌరుడిగా తాను విచారణకు సహకరిస్తానని కెసిఆర్ ఇప్పటికే లేఖ ద్వారా తెలిపారు. 

 

ప్రస్తుతం కెసిఆర్ తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, మరియు న్యాయ బృందంతో విచారణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. 

 

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన విపక్ష నేత వెనిజులా
డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిసిన వెనెజువెలా విపక్షనేత మరియా మచాడో, తనకు బహూకరించిన...
By Rajini Kumari 2026-01-16 12:40:35 0 80
Andhra Pradesh
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన
గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా...
By John Baji 2026-02-04 15:15:25 0 79
Andhra Pradesh
గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే నసీర్ మెడికల్ కాలేజీ ల పీ పీ పీ పై ప్రజలు ఆలోచించండి
*మెడికల్ కాలేజీల పీపీపీపై ప్రజలు ఆలోచించండి* * సంతకాల పేరుతో సైకోల మాటల నమ్మకండి * జగన్ ను...
By KOTESWARARAO KVSR 2025-12-23 14:11:14 0 117
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com