BITS Pilani: ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ... సీఆర్డీఏతో కీలక ఒప్పందం.

0
122

బిట్స్ పిలానీ ఏర్పాటుకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమికి సంబంధించిన ఒప్పంద ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు

అమరావతి క్యాంపస్‌ను మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నామన్న బిట్స్ పిలానీ ప్రతినిధులు

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు బిట్స్ పిలానీ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటైన బిట్స్ పిలానీ అమరావతిలో ఆధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. 

 

ఈ ప్రాజెక్టు కోసం తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 70 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమికి సంబంధించిన ఒప్పందం మందడం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారికంగా పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఆర్‌డీఏ ఎస్టేట్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్ రాజు, బిట్స్ పిలానీ అధీకృత ప్రతినిధి, డిప్యూటీ రిజిస్ట్రార్ వి.వి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు. సబ్‌ రిజిస్ట్రార్ సి.హెచ్. రాంబాబు సమక్షంలో ఒప్పంద ప్రక్రియ జరిగింది. 

 

బిట్స్ అమరావతి క్యాంపస్‌ను మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తొలి దశలోనే సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. పనులు వేగంగా పూర్తి చేసి 2027 నుంచే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపా.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు సభలో ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి దే
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత డాక్టర్ వైయస్...
By Kothuru Murali 2026-02-05 11:58:35 0 119
Health & Fitness
Breakthrough Designation for Liver Disease Therapy
The landscape of metabolic health shifted significantly as the US FDA granted Breakthrough...
By Dunna Jessicaruth 2026-05-19 07:06:45 0 31
Andhra Pradesh
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
By Gadiyapudi Narendra 2026-02-20 16:29:01 0 228
Andhra Pradesh
చింతూరు ఘాట్ రోడ్డులో 'భారీ' బ్రేక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
పోలవరం జిల్లాకు గుండెకాయలాంటి మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు సోమవారం ఉదయం స్తంభించిపోయింది....
By Shyamala Yadagiri 2026-05-11 07:42:03 0 90
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com