Tirumala Theft: తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్.

0
293

తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, మండ నవీన్‌ 

ఈ నెల 28,29 తేదీలలో ఇద్దరు భక్తుల నుంచి నగదు, విలువైన వస్తువులు చోరి చేసిన వైనం

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన టూటౌన్ పోలీసులు

తిరుమలలో భక్తులను మాటలతో బురిడి కొట్టించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ శ్రీరాముడు తెలిపిన సమాచారం మేరకు..తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, హనుమకొండ జిల్లాకు చెందిన మండ నవీన్‌ కలిసి ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. 

 

ఈ నెల 28న కర్ణాటకకు చెందిన శివకుమార్‌ను పీఏసీ -5 వద్ద పరిచయం చేసుకున్న నిందితులు, మరుసటి రోజు అంటే 29న తెలంగాణకు చెందిన మరో భక్తుడితో కల్యాణకట్ట షెడ్ల పరిసర ప్రాంతాల్లో పరిచయం చేసుకున్నారు. భక్తుల నమ్మకాన్ని పొందిన అనంతరం వారి లగేజీ బ్యాగులను మాయమాటలతో స్వాధీనం చేసుకుని అందులోని నగదు, విలువైన వస్తువులను చోరీ చేశారు. 

 

ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేయడంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాంభగీచా కార్‌ పార్కింగ్‌ వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌తో పాటు రూ.45వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ ఇచ్చిన విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు
ఆదివారం మధ్యాహ్నం రాజంపేట పట్టణంలోని ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ గారు ఆహ్వానం మేరకు...
By Benguluri Madhubabu 2026-03-15 08:36:01 0 234
Andhra Pradesh
చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు.
  చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు...
By Pagadala Venkateswar 2026-04-20 03:38:32 0 103
Andhra Pradesh
అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం
విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా...
By Mobbu Venkatramana 2026-03-10 08:56:22 0 313
Andhra Pradesh
బాపట్లలో SAAP లీగ్–2026 జిల్లా స్థాయి చెస్ పోటీలు
బాపట్ల జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (District Sports...
By Gadiyapudi Narendra 2026-02-17 16:12:04 0 194
Andhra Pradesh
గుంటూరు ఈస్ట్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో రాష్ డ్రైవింగ్ మరియు బైక్ రేసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది.
గుంటూరు జిల్లా SP శ్రీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు గుంటూరు East DSP గారు అయిన SK అబ్దుల్...
By KOTESWARARAO KVSR 2025-12-24 17:18:50 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com