జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంది అంటే.. రెండో విడత రైతుబంధు ఇస్తున్నారు. ‎మూడవ విడత ఇవ్వాలంటే కేసీఆర్ ఇంకో సభ పెట్టాల్నా?

0
141

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర్శించారు.

‎ఇది అసలు రాజకీయమా అని ప్రశ్నించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

‎వ్యవసాయం మంచిగుండాలి.. పల్లెలు బాగుండాలి.. వృత్తి పనులు బాగుండాలనే కదా మనం అంటున్నామని కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెలు ఇప్పించామని.. ఇప్పుడొస్తున్నాయా అని ప్రశ్నించారు. మత్స్యకారుల కోసం చేప పిల్లలు పంపిణీ చేశామని.. ఇప్పుడు ఇస్తున్నారా అని అడిగారు. బీడీ కార్మికులు ఎవరూ అడగకుండానే.. పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు. భారతదేశంలో ఎవరైనా అలా ఇస్తారా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెసోళ్లు పెన్షన్లు పెంచుతామని ఎగ్గొట్టారని అన్నారు. అదొక్కటే కాదని.. ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు మహాలక్ష్మీ అని రూ.2500 ఇస్తామని చెప్పారని.. ఇచ్చారా అని ప్రశ్నించారు. స్కూటీలు ఇచ్చారా అని అడిగారు. అలా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పారు.

‎అసలు తెలంగాణలో ఏం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్నం ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పోరాటం చేయాల్సిందేనని.. వాళ్లను నిలదీయాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందేనని స్పష్టం చేశారు.తెలంగాణ సమాచారం

Search
Categories
Read More
Telangana
మే 8 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు షురూ.. షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు....
హైదరాబాద్, : రాష్ట్రవ్యాప్తంగా...   2026-–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్...
By Gujile Ramu 2026-05-05 08:02:14 0 154
Andhra Pradesh
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కాశినేని మహేంద్ర నాయుడు
ఈ సందర్భంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అభివృద్ధి అవసరాలపై మంత్రికి వినతి...
By Benguluri Madhubabu 2026-06-16 10:57:00 0 106
Andhra Pradesh
యువజన ఉత్సవాల ముగింపులో బహుమతులు ప్రధానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పత్రికా ప్రకటన.   గుంటూరు, కేఎల్ యూనివర్సిటీ || 20-12-2025   *వివేకానంద ఆశయాలతో...
By Rajini Kumari 2025-12-20 13:09:49 0 174
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
By Benguluri Madhubabu 2026-01-23 13:17:37 0 266
Telangana
"అంతర్‌రాష్ట్ర దోపిడీ కేసు ఛేదన.. అల్వాల్ పోలీసులకు సీపీ రివార్డులు".|
"డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వీరబాబు బృందాన్ని అభినందించిన సీపీ బి. సుమతి" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-16 13:57:32 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com