జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంది అంటే.. రెండో విడత రైతుబంధు ఇస్తున్నారు. ‎మూడవ విడత ఇవ్వాలంటే కేసీఆర్ ఇంకో సభ పెట్టాల్నా?

0
95

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర్శించారు.

‎ఇది అసలు రాజకీయమా అని ప్రశ్నించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

‎వ్యవసాయం మంచిగుండాలి.. పల్లెలు బాగుండాలి.. వృత్తి పనులు బాగుండాలనే కదా మనం అంటున్నామని కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెలు ఇప్పించామని.. ఇప్పుడొస్తున్నాయా అని ప్రశ్నించారు. మత్స్యకారుల కోసం చేప పిల్లలు పంపిణీ చేశామని.. ఇప్పుడు ఇస్తున్నారా అని అడిగారు. బీడీ కార్మికులు ఎవరూ అడగకుండానే.. పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు. భారతదేశంలో ఎవరైనా అలా ఇస్తారా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెసోళ్లు పెన్షన్లు పెంచుతామని ఎగ్గొట్టారని అన్నారు. అదొక్కటే కాదని.. ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు మహాలక్ష్మీ అని రూ.2500 ఇస్తామని చెప్పారని.. ఇచ్చారా అని ప్రశ్నించారు. స్కూటీలు ఇచ్చారా అని అడిగారు. అలా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పారు.

‎అసలు తెలంగాణలో ఏం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్నం ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పోరాటం చేయాల్సిందేనని.. వాళ్లను నిలదీయాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందేనని స్పష్టం చేశారు.తెలంగాణ సమాచారం

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ రూరల్ మండలం నున్నలో ఆకాల వర్షం
Avja    *విజయవాడ రూరల్ మండలం నున్నలో వడగళ్ల వాన – రైతుల్లో ఆందోళన*  ...
By Rajini Kumari 2026-04-06 12:56:30 0 153
Andhra Pradesh
అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.
గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు,...
By John Baji 2026-02-05 05:39:13 0 308
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన గద్దె రామ్మోహన్ ఎంపీ కేసినేని
*విజ‌య‌వాడ‌* *25-12-2025*   *సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్,...
By Rajini Kumari 2025-12-25 07:43:31 0 197
Andhra Pradesh
పుంగనూరు: ఓకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు.
మంగళవారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని జోగివారిపల్లి పంచాయతీ, కంభంవారి పల్లెలో పాడి రైతు...
By Kothuru Murali 2026-01-28 09:13:35 0 127
Telangana
"బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం...
By Sidhu Maroju 2026-04-11 08:41:37 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com