నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |

0
327

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో డయల్ -100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. టెంపుల్ అల్వాల్ లోని శ్రీకృష్ణ రెసిడెన్సి నివాసి, స్వర్ణకారుడైన వరుగంటి సురేష్ కుమార్ తన దుకాణంలో దొంగతనం జరిగినట్టు సమాచారం అందించారు. 

 

సమాచారం అందుకున్న వెంటనే అల్వాల్ పోలీస్ లు అల్వాల్ లోని జిఎన్ఆర్ హాస్పటల్ సమీపంలో ఉన్న మమతా సాయి జువెలరీ దుకాణానికి చేరుకున్నారు. 

 

దొంగలు దుకాణం షట్టర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. దుకాణం లోపల గాజు అద్దాలు పగిలిపోయి ఉండడమే కాకుండా, వెండి ఆభరణాల పెట్టెలు చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 1.4 కిలోల బరువు గల 43 పెట్టెల వెండి పట్టీలను దుండగులు అపహరించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 

 

మొదటిసారిగా ఘటన స్థలంలోనే FIR:

 

ఇటీవల పోలీస్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. నేరం జరిగిన చోట నుంచే కేసు నమోదు చేసే ప్రక్రియను అల్వాల్ పోలీసులు అమలు చేశారు. బాధితుడి ఫిర్యాదును ఘటన స్థలంలోనే స్వీకరించి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాధితుడికి అందచేశారు. ఈ కేసును అల్వాల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
తమ్ముడి మృతిపై అన్న అనుమానం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన.
మదనపల్లి మండలం వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తన...
By Pagadala Venkateswar 2026-02-28 11:18:42 0 167
Telangana
నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు.....
  ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన.....! భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-11 05:20:08 0 104
Andhra Pradesh
రజక మహిళపై ఓ కత్తితో దాడి చేతి వేళ్ళకు గాయాలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన బాధిత కుటుంబ సభ్యులు రజకులు
చెరుకుపల్లి: నడింపల్లి గ్రామంలో చందోలు సామ్రాజ్యం అని రజక మహిళపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి...
By Gadiyapudi Narendra 2026-02-18 16:43:44 0 202
Andhra Pradesh
రాగోలులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీపీవో
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి రాగోలు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్. గంగీబాబు...
By Manda Ramkumar 2026-03-28 12:34:24 0 394
Andhra Pradesh
మరి కాసేపట్లో టీవీ కే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ
*కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ*   చెన్నైలో కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్...
By Rajini Kumari 2026-05-08 13:30:56 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com