మంచినీటి పనులను అడ్డుకున్న వెల్లంపల్లి మైలవరం రత్నకుమారి ఆగ్రహం

0
56

*విద్యాధరపురం మంచినీటి రిజర్వాయర్ మరమ్మత్తు పనులను అడ్డుకున్న వెలంపల్లి*

 

*44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆగ్రహం*

 విజయవాడ పశ్చిమ, జనవరి 28: స్థానిక 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ కొండపై ఉన్న మంచినీటి రిజర్వాయర్ మరమ్మతు పనులను రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అడ్డుకున్నారని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ అడుగుభాగం పూర్తిగా దెబ్బతిన్నదని , అలాగే రిజర్వాయర్ పై స్లాబ్ పెచ్చులూడి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయని, పైనుండి స్లాబు ముక్కలు ముక్కలుగా పెచ్చులూడి పడిపోతోందని, ఈ రిజర్వాయర్ ను మరమ్మత్తులు చేయించాలని గత రెండేళ్ల నుంచి తాము కౌన్సిల్లో కోరుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ప్రతిపాదనలను పక్కన పెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చెరువు సెంటర్ కొండపై దెబ్బతిన్న స్థితిలో ఉన్న రిజర్వాయర్ ను కూటమి కార్పొరేటర్లు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రత్నకుమారి మాట్లాడుతూ రిజర్వాయర్ మరమత్తులపై 34.12 లక్షల రూపాయలు మేరకు అధికారులు అంచనా వేశారని, దీన్ని స్టాండింగ్ కమిటీ తిరస్కరిస్తూ పలుమార్లు వాయిదాలు వేయడం దారుణమని విమర్శించారు. మంచినీరు కలుషితమైన రావడంతో డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత మంచినీటి వలన ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే దానికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ , అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి కార్పొరేటర్ల ప్రతిపాదనలను వాయిదాలు వేస్తున్న వైసీపీ పాలక పక్షం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోందని, ఇది మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కి, వైసిపి పాలక పక్షానికి సరికాదని అన్నారు. తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయాలను మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన ఇంట్లో కూర్చుని తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. తనను పార్టీ మారాడని విమర్శించే నైతిక అర్హత మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు లేదని అన్నారు. ఆయన 2014 లో కాంగ్రెస్ టికెట్ తీసుకుని ఆ మరుసటి రోజు బిజెపి టికెట్ పొంది ఎమ్మెల్యేగా పోటీ చేశారని, ఆయన కంటే పెద్ద ఫిరాయింపుదారుడు ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి రిజర్వాయర్ మరమ్మత్తు పనులకు వెంటనే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర, అత్తులూరి ఆదిలక్ష్మి, మహదేవు అప్పాజీ రావు, అబ్దుల్ హర్షద్, కూటమి నాయకులు మైలవరపు కృష్ణ, అత్తులూరి పెద్దబాబు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, రెడ్డిపల్లి రాజు, సంభాన బాబురావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నగరంలోని శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి
కర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభ లో రాష్ట్ర మంత్రి టీజి భరత్ , తెలుగుదేశం పార్టీ పొలిట్...
By mahaboob basha 2025-07-16 15:17:32 0 950
Telangana
సామాన్య ప్రజలకు హక్కులు అందించిన మన రాజ్యాంగం- ప్రొఫెసర్ కోదండరాం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన...
By Sidhu Maroju 2025-11-26 15:38:01 0 84
Andhra Pradesh
కార్మికుల ఉన్నతికి అత్యంత ప్రాధాన్యత : మున్సిపల్ కమిషనర్
కర్నూలు సిటీ : కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-01 16:10:40 0 125
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో పర్యటించిన ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం పర్యటించారు. బర్డ్...
By Kothuru Murali 2026-02-16 11:35:12 0 29
Bharat Aawaz
ప్రతి గొంతుకకూ ఓ కథ ఉంది
ప్రతి గొంతుకకూ ఓ కథ ఉంది ఎందరో అణగారిన గొంతుల ఆవేదన ఈ లోకానికి వినిపించడం లేదు. వారి కథలు ఎక్కడో...
By Bharat Aawaz 2025-07-09 04:25:58 0 991
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com