Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్.

0
173

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర (సంకల్ప యాత్ర) చేపట్టిన బండ్ల గణేశ్ కాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న లోకేశ్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. 

 

వైసీపీ హయాంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సమయంలో తాను తిరుమల వెంకన్నకు మొక్కుకున్నానని బండ్ల గణేశ్ తెలిపారు. అనంతరం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి సీఎం పదవిని చేపట్టడంతో, ఆ మొక్కును తీర్చుకునేందుకే ఈ నెల 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి బండ్ల గణేశ్ సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టారు. 

 

కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటానని ఆయన తెలిపారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో బండ్ల గణేశ్‌కు మార్గమధ్యలో టీడీపీ అభిమానులు, నేతలు స్వాగతం పలుకుతూ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ ఫోన్ చేసి గణేశ్‌ను పరామర్శించారు. 

Search
Categories
Read More
Telangana
Fire Accident at Kphb!!!!
Fire accident helf at kphb yesterday night. Its a private travels bus ( Hyderabad to palakollu)...
By Terli Ashok 2026-04-18 07:55:59 0 446
SURAKSHA
Anurag Verma, IAS: Leading Punjab with Vision
A Distinguished Punjab Cadre IAS Officer Driving Governance, Administrative Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-17 10:57:03 0 77
SURAKSHA
రోడ్డు భద్రత: ప్రాణాలను కాపాడే ప్రయత్నం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు వినూత్న కార్యక్రమాలతో ప్రజల ప్రాణాలను...
By Kalaga Sailaja 2026-06-26 06:17:08 0 60
Andhra Pradesh
మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.
మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు...
By Pagadala Venkateswar 2026-03-21 11:26:31 0 180
Andhra Pradesh
ఐకమత్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ.
మదనపల్లిలో బక్రీద్ పండుగ సందర్భంగా డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ...
By Pagadala Venkateswar 2026-05-26 05:43:59 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com