Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్.

0
174

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర (సంకల్ప యాత్ర) చేపట్టిన బండ్ల గణేశ్ కాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న లోకేశ్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. 

 

వైసీపీ హయాంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సమయంలో తాను తిరుమల వెంకన్నకు మొక్కుకున్నానని బండ్ల గణేశ్ తెలిపారు. అనంతరం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి సీఎం పదవిని చేపట్టడంతో, ఆ మొక్కును తీర్చుకునేందుకే ఈ నెల 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి బండ్ల గణేశ్ సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టారు. 

 

కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటానని ఆయన తెలిపారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో బండ్ల గణేశ్‌కు మార్గమధ్యలో టీడీపీ అభిమానులు, నేతలు స్వాగతం పలుకుతూ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ ఫోన్ చేసి గణేశ్‌ను పరామర్శించారు. 

Search
Categories
Read More
SURAKSHA
N. Ashok Kumar, IAS: Leading Mizoram with Vision
The Journey Begins "The true measure of governance is not the policies announced,...
By Fathima Safa 2026-07-21 11:39:43 0 40
Telangana
రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్ : స్పందించిన డిజిపి
హైదరాబాద్:  రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-10-20 08:20:14 0 320
Telangana
విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ
మహబూబాబాద్,మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం...
By Bheeshman King 2026-07-22 12:52:40 0 67
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం పరిధిలో శాంతినగర్ వద్ద కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు...
By Kothuru Murali 2026-02-20 10:58:31 0 151
Andhra Pradesh
* *ఖనిజాల శాఖ ఉద్యోగిపై ఏసీబీ దాడులు.*
* *_ఖనిజాల శాఖ ఉద్యోగిపై ఏసీబీ దాడులు.._* * *_ప్రకాశం జిల్లా:_* * _భూగర్భ ఖనిజాల శాఖ కార్యాలయ...
By Chennaiah Kati 2026-02-07 17:34:53 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com