ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు

0
177

*పత్రికా ప్రకటన*         

 

*ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*

 

" వెండిరధం పై ఊరేగిన ఆదిదంపతులు"

 

ఇంద్రకీలాద్రి పై వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవల్లో భాగంగా...సాయంత్రం 5 గంటలకు -శ్రీ మల్లేశ్వర మహా మండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండిరధోత్సవం ప్రారంభం అయింది.

సంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాట నృత్యములు, తాళం భజన కళాకారుల ప్రదర్శలు ముందు సాగుతుండగా, వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి రధోత్సవసేవ 

కనకదుర్గానగర్, కుమ్మరి పాలెం సెంటర్, కామకోటి నగర్, శంకర మఠం, విద్యాధరపురం, సొరంగమార్గం, కొత్తపేట, బ్రాహ్మణవీధి,రధం సెంటర్ మీదుగా దేవస్థానమునకు చేరుకుంటుంది.

వెండిరధంపై కొలువైన ఆది దంపతులు భక్త కోటిని అనుగ్రహించారు.

ఆది దంపతులు వేంచేసిన వెండి రధం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ),ఆలయ ఈవో వికె శీనా నాయక్, ధర్మ కర్తల మండలి సభ్యులు, స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ,వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం తో మదనపల్లి అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును...
By Pagadala Venkateswar 2026-02-24 07:36:44 0 153
Andhra Pradesh
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కాశినేని మహేంద్ర నాయుడు
ఈ సందర్భంగా రాయచోటి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అభివృద్ధి అవసరాలపై మంత్రికి వినతి...
By Benguluri Madhubabu 2026-06-16 10:57:00 0 106
Andhra Pradesh
AP Farmers: రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ కూటమి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది....
By Pagadala Venkateswar 2026-03-03 06:15:51 0 166
Tamilnadu
CM Vijay to Announce Kumbakonam as New District Soon
Chief Minister C. Joseph Vijay is anticipated to officially declare Kumbakonam as a newly formed,...
By Tejaswini Komanduru 2026-06-15 04:55:27 0 353
Andhra Pradesh
మదనపల్లెలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్.. పారిశుద్ధ్య పనులు ముమ్మరం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని ముమ్మరంగా...
By Pagadala Venkateswar 2026-06-01 04:29:27 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com