Pawan Kalyan: సిక్కు తలపాగా ధరించిన పవన్ కల్యాణ్.

0
128

Pawan Kalyan: సిక్కు తలపాగా ధరించిన పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో!

25-01-2026 Sun 19:59 | Andhra

 

Pawan Kalyan Visits Sikh Gurudwara in Nanded Donning Turban

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో కలిసి నాందేడ్ గురుద్వారాను సందర్శించిన పవన్ కల్యాణ్

గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు, చాదర్ సమర్పణ

పవన్ కల్యాణ్‌ను ఘనంగా సత్కరించిన గురుద్వారా కమిటీ

గురు తేగ్ బహదూర్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి

ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్ తఖ్త్ సచ్ ఖండ్ గురుద్వారాను సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ఆయన ఈ పర్యటనలో పాల్గొన్నారు. సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ఇరువురు నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పవిత్ర చాదర్‌ను సమర్పించారు.

 

గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ వచ్చిన పవన్ కల్యాణ్, మధ్యాహ్నం సచ్ ఖండ్ గురుద్వారాకు చేరుకున్నారు. గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గురుద్వారా ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు సంప్రదాయ సిక్కు తలపాగాను అలంకరించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో కలిసి ప్రధాన మందిరంలోకి ప్రవేశించారు. గురు గోవింద్ సింగ్ సమాధి వద్ద ప్రార్థనలు చేసి, చాదర్ సమర్పించారు. గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రంతో పవన్ కల్యాణ్, ఫడ్నవిస్‌లను ఆశీర్వదించారు. దర్శనం అనంతరం గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్‌ను వారు ప్రారంభించారు.

 

అంతకుముందు, తొలిసారి గురుద్వారాకు విచ్చేసిన పవన్ కల్యాణ్‌ను సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికతో పాటు, సిక్కులు పవిత్రంగా భావించే కిర్పాన్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ... "గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిప్రదాత. ఆయన చేసిన త్యాగం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి మహనీయుడి షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను" అని తెలిపారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటైన ఈ గురుద్వారా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు
బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన...
By Kothuru Murali 2026-04-16 17:15:32 0 76
Telangana
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని...
By Pinnehasan Odela 2026-01-15 14:40:44 0 215
Andhra Pradesh
పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన చిన్న రాయల్.
రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన...
By Kothuru Murali 2026-01-22 12:01:15 0 149
Andhra Pradesh
మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు.
మదనపల్లె జవహర్ నవోదయ పాఠశాలలో 11వ తరగతి, 4వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 11వ...
By Pagadala Venkateswar 2026-02-08 10:51:11 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com