Pawan Kalyan: సిక్కు తలపాగా ధరించిన పవన్ కల్యాణ్.

0
163

Pawan Kalyan: సిక్కు తలపాగా ధరించిన పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో!

25-01-2026 Sun 19:59 | Andhra

 

Pawan Kalyan Visits Sikh Gurudwara in Nanded Donning Turban

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో కలిసి నాందేడ్ గురుద్వారాను సందర్శించిన పవన్ కల్యాణ్

గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు, చాదర్ సమర్పణ

పవన్ కల్యాణ్‌ను ఘనంగా సత్కరించిన గురుద్వారా కమిటీ

గురు తేగ్ బహదూర్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి

ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్ తఖ్త్ సచ్ ఖండ్ గురుద్వారాను సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ఆయన ఈ పర్యటనలో పాల్గొన్నారు. సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ఇరువురు నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పవిత్ర చాదర్‌ను సమర్పించారు.

 

గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ వచ్చిన పవన్ కల్యాణ్, మధ్యాహ్నం సచ్ ఖండ్ గురుద్వారాకు చేరుకున్నారు. గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గురుద్వారా ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు సంప్రదాయ సిక్కు తలపాగాను అలంకరించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో కలిసి ప్రధాన మందిరంలోకి ప్రవేశించారు. గురు గోవింద్ సింగ్ సమాధి వద్ద ప్రార్థనలు చేసి, చాదర్ సమర్పించారు. గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రంతో పవన్ కల్యాణ్, ఫడ్నవిస్‌లను ఆశీర్వదించారు. దర్శనం అనంతరం గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్‌ను వారు ప్రారంభించారు.

 

అంతకుముందు, తొలిసారి గురుద్వారాకు విచ్చేసిన పవన్ కల్యాణ్‌ను సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికతో పాటు, సిక్కులు పవిత్రంగా భావించే కిర్పాన్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ... "గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిప్రదాత. ఆయన చేసిన త్యాగం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి మహనీయుడి షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను" అని తెలిపారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటైన ఈ గురుద్వారా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు రక్తదానం: ప్రాణాలు కాపాడే సేవ
 AP పోలీస్ శాఖ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం నిర్వహించింది....
By Kalaga Sailaja 2026-07-06 05:38:54 0 82
Andhra Pradesh
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
By Pagadala Venkateswar 2026-03-28 04:16:07 0 190
SURAKSHA
AP పోలీసులు: సైబర్ మోసాలపై అవగాహన యోధులుగా నేడు
నేడు AP పోలీసులు రాష్ట్రమంతటా సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీలు చేశారు. విశాఖ, గుంటూరు, గ్రామాల్లో OTP...
By Kalaga Sailaja 2026-07-04 09:39:51 0 50
Andhra Pradesh
జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో లక్ష్మి అభిజత్య ప్రతిభ
జెఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బొబ్బిలి పట్టణంలోని టీచర్స్ కాలనీకు చెందిన పల్లికల లక్ష్మి అభిజత్య...
By Boiena Rajesh 2026-06-01 12:16:18 0 189
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా గోపూజ మహోత్సవం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో గోపూజ మహోత్సవం అత్యంత వైభవంగా,...
By Rajini Kumari 2026-01-14 12:38:32 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com