Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.

0
169

పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం

మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా రూ.44 లక్షలు విరాళం

టీటీడీలోని వివిధ ట్రస్టులకు ఈ విరాళాలను కేటాయింపు

తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, అలాగే ఓ విద్యాసంస్థల అధినేత వేర్వేరుగా స్వామివారికి కోట్లాది రూపాయలను కానుకగా సమర్పించారు. ఈ విరాళాలను టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ సేవా ట్రస్టులకు కేటాయించారు.

 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ, టీటీడీ ట్రస్టులకు మొత్తం రూ. 2.50 కోట్లు విరాళంగా ఇచ్చింది. సంస్థ ప్రతినిధి రాజగోపాలరాజు, శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ విరాళంలో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు, విద్యాదాన ట్రస్టుకు చెరో రూ.75 లక్షలు ఉన్నాయి. అలాగే బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, అన్నప్రసాదం, గో సంరక్షణ ట్రస్టులకు చెరో రూ.25 లక్షలు చొప్పున అందించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ విరాళం అందించిన కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్‌ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.

 

మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం ఆయన రూ. 44 లక్షలు అందించారు. నేడు మంత్రి లోకేశ్‌ పేరిట టీటీడీ అన్నప్రసాద కేంద్రంలో ప్రత్యేకంగా అన్నదానం నిర్వహించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు జిల్లా లో ఉద్యోగ మేళ !!
కర్నూలు : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న కర్నూలు జిల్లా వెల్దుర్తి పంచాయతీ...
By Hari Krishna 2025-12-14 14:30:50 0 312
Telangana
హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్...
By Sidhu Maroju 2026-02-23 15:43:34 0 210
Telangana
కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు
హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి)  కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద...
By Prashanth Goindla 2026-04-05 13:50:31 0 407
Andhra Pradesh
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపు
పత్రికా ప్రకటన    మచిలీపట్నం డిసెంబర్ 20: ---------   ప్రతి ఒక్కరూ పరిసరాల...
By Rajini Kumari 2025-12-20 14:07:57 0 182
Telangana
చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు
మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి...
By Thalakayala Nagashiva 2026-04-13 10:13:52 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com