AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?

0
300

Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం. 2024 జూన్ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది.Amaravati Capital: ఈనెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 10 ఏళ్లు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లు కావస్తున్నా ఇంకా దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలని అంది. ఈ క్రమంలో 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. పట్టణాభివృద్ధి, న్యాయ శాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉందంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్‌లో చర్చించి ఆమోదించనుంది. ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైందని అధికారులు చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*
గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ...
By mahaboob basha 2025-10-25 14:12:09 0 224
Andhra Pradesh
గుంటూరులో ట్రాఫిక్ నిబంధనలపై భారీ అవగాహన ర్యాలీ – ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎ. అశోక్ కుమార్
గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ డి.ఎస్.పి , బెల్లం శ్రీనివాసరావు...
By John Baji 2025-12-24 16:04:51 0 211
Uttar Pradesh
UP Invites Citizens to Shape Development Vision 2047 |
The UP government has launched a citizen engagement drive to shape development plans for 2047....
By Pooja Patil 2025-09-16 05:02:08 0 427
Telangana
మధ్యతరగతి ప్రజలకు ఊరట ధరలు తగ్గే అవకాశం
*మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్ చేసిన మోడీ గారు.. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్...
By Vadla Egonda 2025-07-05 01:39:30 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com