AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?

0
612

Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం. 2024 జూన్ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది.Amaravati Capital: ఈనెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 10 ఏళ్లు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లు కావస్తున్నా ఇంకా దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలని అంది. ఈ క్రమంలో 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. పట్టణాభివృద్ధి, న్యాయ శాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉందంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్‌లో చర్చించి ఆమోదించనుంది. ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైందని అధికారులు చెప్పారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా...
By Ponnala Srinivasrao 2026-03-15 17:16:42 0 265
Telangana
జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ సాయుధ పోరాట తొలి...
By Bheeshman King 2026-07-04 10:03:01 0 271
Andhra Pradesh
పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే...
By Kothuru Murali 2026-05-07 12:05:52 0 105
Andhra Pradesh
ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి
*ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి*     *సమ్మె జయప్రదం కొరకు కార్మిక...
By Rajini Kumari 2026-02-06 11:28:57 0 172
Andhra Pradesh
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
చింతూరు: స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కారం పొందేందుకు...
By Shyamala Yadagiri 2026-04-22 02:25:28 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com