మహిళా కానిస్టేబుల్ జయ శాంతి స్ఫూర్తిగాద హోం మినిస్టర్ అనిత

0
138

కర్తవ్యం జయశాంతి!

 

కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి స్ఫూర్తిగాథ!

 

ఖాకీ దుస్తులు ధరించినప్పుడు మాత్రమే కాదు, సాధారణ పౌరురాలిగా ఉన్నప్పుడు కూడా బాధ్యతను మర్చిపోని ఒక మహిళా కానిస్టేబుల్ కథ ఇది. కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయి వేలాది మంది ఇబ్బందులు పడుతున్న వేళ, ఒక తల్లి తన బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ నియంత్రించిన తీరు యావత్ రాష్ట్రాన్ని కదిలించింది.

 

శనివారం సాయంత్రం కెనాల్ రోడ్డులో ఒక లారీ మొరాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో లేకపోయినా, తన రెండున్నరేళ్ల కుమారుడిని ఎత్తుకుని ఉన్నప్పటికీ, జయశాంతి వెనకడుగు వేయలేదు. ఒకవైపు కన్నప్రేమ, మరోవైపు ప్రజాసేవ.. ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆమె గంటల తరబడి ట్రాఫిక్ ను చక్కదిద్దిన దృశ్యం పోలీసు వ్యవస్థకే గర్వకారణం.

 

ఈ అద్భుతమైన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత స్వయంగా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సంభాషణలో జయశాంతి మాటలు ఎంతో వినయంగా, గర్వంగా ఉన్నాయి. తన భర్త కూడా ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ అని, తమది పోలీసుల కుటుంబమని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.

 

మంత్రి అనిత మాటల్లో.. "జయశాంతి లాంటి పోలీసులు ఉన్నందుకే నేడు పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. మీ సేవలు వెలకట్టలేనివి" అంటూ మంత్రి అనిత ఆమెను ప్రశంసించారు. అంతేకాకుండా, జయశాంతి తనను కలవాలని కోరగా, వెంటనే సానుకూలంగా స్పందిస్తూ విజయవాడలో కలుద్దామని హామీ ఇచ్చారు.

 

యూనిఫామ్ లేకపోయినా, చంకలో చిన్న బిడ్డ ఉన్నా.. బాధ్యతను గుర్తెరిగి స్పందించిన జయశాంతి ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఒక తల్లిగా, ఒక రక్షక భటురాలిగా ఆమె చూపిన తెగువకు సెల్యూట్!

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal Pradesh Begins Work on Namsai Medical College |
The Arunachal Pradesh government has started construction of its second medical college in...
By Pooja Patil 2025-09-16 09:42:08 0 679
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి.
మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-08 05:29:48 0 64
Andhra Pradesh
ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం - ప్రాణాలను కాపాడుకుందాం:ఎస్.ఐ పవన్ కుమార్
చీరాల పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరియు ప్రజల్లో ట్రాఫిక్ క్రమశిక్షణను...
By Vadlamudi NagaVenkat 2026-04-30 12:10:12 0 167
Andhra Pradesh
శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు
  మండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట...
By Boya Dasthagiri 2026-03-25 13:07:53 0 247
Andhra Pradesh
Job Mela in kuppam
కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. యువతకు...
By G k Nookala 2026-03-25 10:00:41 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com