మహిళా కానిస్టేబుల్ జయ శాంతి స్ఫూర్తిగాద హోం మినిస్టర్ అనిత

0
61

కర్తవ్యం జయశాంతి!

 

కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి స్ఫూర్తిగాథ!

 

ఖాకీ దుస్తులు ధరించినప్పుడు మాత్రమే కాదు, సాధారణ పౌరురాలిగా ఉన్నప్పుడు కూడా బాధ్యతను మర్చిపోని ఒక మహిళా కానిస్టేబుల్ కథ ఇది. కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయి వేలాది మంది ఇబ్బందులు పడుతున్న వేళ, ఒక తల్లి తన బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ నియంత్రించిన తీరు యావత్ రాష్ట్రాన్ని కదిలించింది.

 

శనివారం సాయంత్రం కెనాల్ రోడ్డులో ఒక లారీ మొరాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో లేకపోయినా, తన రెండున్నరేళ్ల కుమారుడిని ఎత్తుకుని ఉన్నప్పటికీ, జయశాంతి వెనకడుగు వేయలేదు. ఒకవైపు కన్నప్రేమ, మరోవైపు ప్రజాసేవ.. ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆమె గంటల తరబడి ట్రాఫిక్ ను చక్కదిద్దిన దృశ్యం పోలీసు వ్యవస్థకే గర్వకారణం.

 

ఈ అద్భుతమైన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత స్వయంగా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సంభాషణలో జయశాంతి మాటలు ఎంతో వినయంగా, గర్వంగా ఉన్నాయి. తన భర్త కూడా ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ అని, తమది పోలీసుల కుటుంబమని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.

 

మంత్రి అనిత మాటల్లో.. "జయశాంతి లాంటి పోలీసులు ఉన్నందుకే నేడు పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. మీ సేవలు వెలకట్టలేనివి" అంటూ మంత్రి అనిత ఆమెను ప్రశంసించారు. అంతేకాకుండా, జయశాంతి తనను కలవాలని కోరగా, వెంటనే సానుకూలంగా స్పందిస్తూ విజయవాడలో కలుద్దామని హామీ ఇచ్చారు.

 

యూనిఫామ్ లేకపోయినా, చంకలో చిన్న బిడ్డ ఉన్నా.. బాధ్యతను గుర్తెరిగి స్పందించిన జయశాంతి ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఒక తల్లిగా, ఒక రక్షక భటురాలిగా ఆమె చూపిన తెగువకు సెల్యూట్!

Search
Categories
Read More
Andhra Pradesh
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా|| వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లను సమర్థవంతంగా...
By Gadiyapudi Narendra 2026-01-06 12:30:45 0 102
Andhra Pradesh
గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:06:36 0 147
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 931
Andhra Pradesh
APలో పెద్ద సంఖ్యలో IAS,IPS లకు పదోన్నతులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది....
By John Baji 2025-12-28 14:40:15 0 131
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com