మహిళా కానిస్టేబుల్ జయ శాంతి స్ఫూర్తిగాద హోం మినిస్టర్ అనిత

0
177

కర్తవ్యం జయశాంతి!

 

కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి స్ఫూర్తిగాథ!

 

ఖాకీ దుస్తులు ధరించినప్పుడు మాత్రమే కాదు, సాధారణ పౌరురాలిగా ఉన్నప్పుడు కూడా బాధ్యతను మర్చిపోని ఒక మహిళా కానిస్టేబుల్ కథ ఇది. కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయి వేలాది మంది ఇబ్బందులు పడుతున్న వేళ, ఒక తల్లి తన బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ నియంత్రించిన తీరు యావత్ రాష్ట్రాన్ని కదిలించింది.

 

శనివారం సాయంత్రం కెనాల్ రోడ్డులో ఒక లారీ మొరాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో లేకపోయినా, తన రెండున్నరేళ్ల కుమారుడిని ఎత్తుకుని ఉన్నప్పటికీ, జయశాంతి వెనకడుగు వేయలేదు. ఒకవైపు కన్నప్రేమ, మరోవైపు ప్రజాసేవ.. ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆమె గంటల తరబడి ట్రాఫిక్ ను చక్కదిద్దిన దృశ్యం పోలీసు వ్యవస్థకే గర్వకారణం.

 

ఈ అద్భుతమైన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత స్వయంగా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సంభాషణలో జయశాంతి మాటలు ఎంతో వినయంగా, గర్వంగా ఉన్నాయి. తన భర్త కూడా ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ అని, తమది పోలీసుల కుటుంబమని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.

 

మంత్రి అనిత మాటల్లో.. "జయశాంతి లాంటి పోలీసులు ఉన్నందుకే నేడు పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. మీ సేవలు వెలకట్టలేనివి" అంటూ మంత్రి అనిత ఆమెను ప్రశంసించారు. అంతేకాకుండా, జయశాంతి తనను కలవాలని కోరగా, వెంటనే సానుకూలంగా స్పందిస్తూ విజయవాడలో కలుద్దామని హామీ ఇచ్చారు.

 

యూనిఫామ్ లేకపోయినా, చంకలో చిన్న బిడ్డ ఉన్నా.. బాధ్యతను గుర్తెరిగి స్పందించిన జయశాంతి ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఒక తల్లిగా, ఒక రక్షక భటురాలిగా ఆమె చూపిన తెగువకు సెల్యూట్!

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ గంజాయి రహిత జిల్లా గా మారాలి ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్, ఐపీస్ గారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 27.12.2025* _*//గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు....
By KOTESWARARAO KVSR 2025-12-27 10:13:22 0 250
Andhra Pradesh
బాపట్లలో SAAP లీగ్–2026 జిల్లా స్థాయి చెస్ పోటీలు
బాపట్ల జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (District Sports...
By Gadiyapudi Narendra 2026-02-17 16:12:04 0 194
Andhra Pradesh
APRMSSS ప్రథమ వార్షికోత్సవానికి బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ను ఆహ్వానం
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని  అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-04-13 08:44:21 0 149
Telangana
"కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో సమస్యలపై స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్‌క్లేవ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను...
By Sidhu Maroju 2026-04-13 08:35:07 0 230
Andhra Pradesh
గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.
  <>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్...
By KOTESWARARAO KVSR 2026-01-24 13:06:36 0 594
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com