Nara Lokesh: జ్యూరిచ్‌లో నారా లోకేశ్ సింపుల్ లుక్...

0
176

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ చేరిన చంద్రబాబు బృందం

దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న ఏపీ టీమ్

 

 

ఫుల్ హ్యాండ్ టీషర్టు, ప్యాంట్ తో లోకేశ్ క్యాజువల్ లుక్

దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని, ఏపీకి వీలైనన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ బృందం స్విట్జర్లాండ్ తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇవాళ జ్యూరిచ్ లో ఏపీ టీమ్ విస్తృత సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ రొటీన్ కు భిన్నంగా క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా దర్శనమిచ్చారు. గోధుమ రంగు ఫుల్ హ్యాండ్ టీషర్టు, ప్యాంట్ ధరించి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. 

 

కాగా, ఇవాళ దావోస్ పర్యటన ఆరంభంలోనే చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. స్విట్జర్లాండ్‌కు భారత రాయబారిగా ఉన్న మృదుల్ కుమార్‌తో చంద్రబాబు జ్యూరిచ్‌లో భేటీ అయ్యారు. ఫార్మా, మెడికల్ పరికరాలు, టెక్నాలజీ వంటి రంగాల్లో స్విస్ కంపెనీల నుంచి ఏపీకి పెట్టుబడులను తీసుకురావడంపై చర్చించారు. అనంతరం ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత క్రియేటివ్ పరిశ్రమల ఏర్పాటు, ఏఐ ఫిల్మ్ సిటీ వంటి ప్రతిపాదనలపై చర్చలు జరిపారు.

 

 

 

జనవరి 23 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా 'బ్రాండ్ ఆంధ్ర'ను ప్రపంచానికి పరిచయం చేస్తూ గ్రీన్ ఎనర్జీ, ఏఐ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ఏపీ బృందం దృష్టి సారించనుంది. దావోస్ సదస్సులో భాగంగా ఐబీఎం, గూగుల్ క్లౌడ్ వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో సహా మొత్తం 36 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దళిత నాయకులు అంటే అంత చిన్న చూపా
దళిత విద్యార్థులు విద్యార్థి సంఘాల్లో ఉండకూడదా.దళిత విద్యార్థి సంఘాల నాయకులు అంటే ఎందుకు అంత...
By Boya Dasthagiri 2026-06-19 12:34:35 0 138
Andhra Pradesh
నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ.
    'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ 22-ఏ నిషేధిత జాబితా...
By Pagadala Venkateswar 2026-07-09 05:35:52 0 56
Media Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy Journalism is more than just...
By Media Academy 2025-04-29 04:47:42 0 4K
Telangana
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  మంచిర్యాల : ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్...
By Avunoori Mahesh 2026-06-13 13:15:05 0 135
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, బొనేపల్లి గ్రామ మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని వ్యాక్స్ వ్యాగన్...
By Kothuru Murali 2026-02-08 10:19:56 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com