రైలు వన్ యాప్:: రైల్వే శాఖ

0
186

కర్నూలు ; 

రైల్ వన్ యాప్
రైలు టికెట్‌పై రిబేటు
3 శాతం ప్రకటించిన రైల్వే శాఖ
మార్చి తర్వాత యూటీఎస్ రద్దు

కర్నూలు : రైల్వే శాఖ పలు రకాల రైలు సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చింది. ఇందులో భాగంగా రైలు ప్రయాణికులకు మరింత చేరువగా రైల్ వన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ టికెట్‌పై 3 శాతం రిబేటు ప్రకటించింది. ఈ యాప్ ద్వారా బుధవారం నుంచి టికెట్ల రిబేటు విధానాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో అన్ రిజర్వ్‌డ్ టికెట్ల జారీ కోసం రైల్వే శాఖ 'యూటీఎస్' (UTS) పేరిట ఒక యాప్‌ను లాంచ్ చేసింది. ఆ అప్లికేషన్‌పై రైల్వే శాఖ ప్రచారం చేసినా పూర్తిస్థాయిలో ప్రజల ఆదరణ పొందలేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రైల్వే ఆన్‌లైన్ సేవలను ఒక గొడుగు కిందకు తెచ్చే క్రమంలో గత ఏడాది జూలైలో రైల్ వన్ యాప్‌ను ప్రారంభించింది. ఆ యాప్ ద్వారా రైలు టికెట్లపై ఎటువంటి డిస్కౌంట్ ప్రకటించలేదు. సాధారణంగా టికెట్లు జారీ ఆప్షన్ రైల్ వన్ యాప్‌లో ఉండటంతో యూటీఎస్ అవసరం లేకుండాపోయింది. దీంతో మార్చి నుంచి ఆ యాప్ రద్దు చేసే యోచనలో రైల్వే శాఖ ఉంది. ఈ మేరకు యూటీఎస్ యాప్‌లో ఆన్‌లైన్ జనరల్ టికెట్ పై ఇచ్చే 3 శాతం డిస్కౌంట్‌ను రైల్ వన్ యాప్‌లో సంక్రాంతి కానుకగా రైల్వే శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
అన్ని రకాల టికెట్లపై డిస్కౌంట్... యూటీఎస్ యాప్‌లో కేవలం అన్ రిజర్వ్‌డ్ టికెట్లు జారీ చేసేవారు. అలాగే వాలెట్ డబ్బుతో బుక్ చేసే అన్ రిజర్వ్‌డ్ టికెట్లపై మాత్రమే 3 శాతం రిబేటు లభించేది. ప్రస్తుతం రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వ్‌డ్ తో పాటు రిజర్వ్‌డ్ టికెట్లపై కూడా 3 శాతం రిబేటు ఇవ్వడానికి రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. రైల్వే శాఖ టికెట్లు జారీ చేసే కమర్షియల్ శాఖ సిబ్బందిని, కౌంటర్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లను తగ్గించే లక్ష్యంతో దశాబ్దం కిందట యూటీఎస్ యాప్‌ను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. కేవలం ఈ యాప్ అన్ రిజర్వ్‌డ్ టికెట్లకే పరిమితం కావడంతో ప్రయాణికులు రిజర్వుడు టికెట్ల కోసం ఆయా రైల్వే స్టేషన్లలోని పీఆర్‌ఎస్ కౌంటర్లకు రావడమే కాకుండా ఐఆర్‌సీటీసీ, ఇతర ప్రైవేటు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడం వంటివి చేసేవారు. దీనిని అధిగమిస్తూ రైల్వే శాఖ సరికొత్తగా రైల్ వన్ యాప్‌ను డిజైన్ చేసింది. ఇతర సేవలను కూడా దీని ద్వారా ప్రయాణికులకు అందించి ఆదరణ పొందే యత్నంలో భాగంగానే రైల్ వన్ యాప్ ద్వారా అన్ని రకాల టికెట్ల బుకింగ్ పై 3 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

Search
Categories
Read More
Telangana
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి...
By Ponnala Srinivasrao 2026-06-08 02:58:30 0 124
Telangana
Yellow Alert ఈ జిల్లాలో వర్షాలు..,
భారత్ అవాజ్ న్యూస్: 19 జూలై రోజున వాతావరణం శాఖ వెలువడించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు...
By Gujile Ramu 2026-07-19 00:32:44 0 57
Andhra Pradesh
రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల...
By Pagadala Venkateswar 2026-02-24 06:48:39 1 206
Andhra Pradesh
రత్నాపురంలో 3 రోజుల పాటు కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక "డ్రైవ్"
చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు...
By Shyamala Yadagiri 2026-05-21 04:37:35 0 176
Telangana
Mukkoti ekadasi (30-12-2025)
Mukkoti Ekadasi 2025 ధనుర్మాసం (Dhanurmasam 2025) వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే...
By G k Nookala 2025-12-26 08:47:41 0 505
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com