ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ముగ్గుల పోటీలు

0
188

*ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు* 

 

*మంగళగిరి:*

మంగళగిరి వామ్ (ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ) రాజ్యలక్ష్మి ఆవోపా, వాసవి క్లబ్ వనిత సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పెదకోనేరు వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కోఆర్డినేటర్ గాదంశెట్టి సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వామ్ ఆంధ్రప్రదేశ్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు దేవతి భగవ న్నారాయణ, ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య మంగళగిరి అధ్యక్షులు సంకా బాలాజీ గుప్తా, మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్టి రామానుజ దాస, మద్దుల శివ శంకర ప్రసాద్, డోగిపర్తి శ్రీనివాసరావు, గాదంశెట్టి రామకృష్ణ, డాక్టర్ పి.గిరిజ, దివ్వెల ఆదిలక్ష్మి, మద్ది భాగ్యలక్ష్మి, నేరెళ్ల పద్మజ, నేరెళ్ల లక్ష్మీ రాధిక, నేరెళ్ల పద్మజ, వనమా గీతాదేవి, కాళంగి శరణ్య, పారేపల్లి అరుణ, తాడేపల్లి హేమలత, మాజేటి కుమారి, ప్రియాంక, పొట్టి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవం జరిగింది. మొదటి బహుమతి ఎస్ సౌభాగ్య లక్ష్మి, రెండో బహుమతి పి. భవాని, మూడవ బహుమతి ఎం. వర్షిత, కన్సోలేషన్ బహుమతి వి. లీలా మానస కు ముఖ్య అతిథులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో విష్ణు విద్యాసంస్థల విద్యార్థినులు 100 మందికి పైగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. 

Search
Categories
Read More
Telangana
జగిత్యాల : ఈరోజు KCR సాయంత్రం 4:45 pm
జగిత్యాల సభ నేపథ్యంలో నేడు సాయంత్రం 4:45 pm గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ జగిత్యాలకు...
By Sunka Santhosh 2026-04-20 10:28:22 0 213
Business & Finance
Partnership Registration Strengthens Business Success
Partnership Registration is an excellent choice for two or more individuals starting a business...
By Navya Sree 2026-07-22 05:15:06 0 24
Telangana
జేబీఎస్ వేదికగా యాంటీ డ్రగ్ సందేశం.|
"జేబీఎస్‌లో పోలీసుల వినూత్న కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు" మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-06-26 13:09:46 0 87
Maharashtra
Mumbai Metro Expansion and Urban Transport Progress
Mumbai Metro expansion is transforming urban mobility by improving connectivity, reducing travel...
By Fathima Safa 2026-06-23 07:55:52 0 116
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా  పుంగనూరు మండల సమీపంలోని బటందొడ్డి దొడ్డి మలుపు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు...
By Kothuru Murali 2026-02-07 06:54:54 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com