కార్మికుల శ్రమతోనే నగరానికి గుర్తింపు : కమిషనర్

0
242

కర్నూలు సిటీ : కర్నూలు : 

కార్మికుల శ్రమతో నగరానికి ప్రత్యేక గుర్తింపు

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• సకాలంలో వేతనాలు, పనిముట్లు, హైజిన్ కిట్లు
• ఉచిత జీవిత బీమాలో నమోదు అవసరం

పారిశుద్ధ్య కార్మికుల అంకితభావం, నిరంతర శ్రమ వల్లనే నగరానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం కల్లూరు, ముజఫర్‌నగర్, బళ్లారి చౌరస్తా, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్, ముజఫర్‌నగర్ వద్ద కార్మికులతో కాసేపు మాట్లాడారు. పారిశుద్ధ్య పనుల్లో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సహకారం, వేతనాల అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులు సూచించిన అంశాలను విన్నా కమిషనర్, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కార్మికులకు సంబంధించిన వేతనాలు సకాలంలో అందేలా తమ పరిధిలోని ప్రక్రియలను సమయానికి పూర్తి చేస్తున్నామని తెలిపారు. అవసరమైన పనిముట్లు ఇప్పటికే పంపిణీ చేశామని, మిగిలినవాటిని త్వరలో అందజేస్తామని చెప్పారు. ఆయిల్, సోప్ వంటి హైజిన్ కిట్లు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయని, ప్రక్రియ పూర్తైన వెంటనే వాటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ యాక్సిస్ బ్యాంకుతో కలిసి ప్రత్యేక బీమా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ వివరించారు. యాక్సిస్ బ్యాంకు ద్వారా వేతనం పొందుతున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రెగ్యులర్ వర్కర్‌కు రూ.1 కోటి, ఆప్కాస్ ఉద్యోగికి రూ.20 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. సాధారణ మరణం సంభవించినా రెగ్యులర్ వర్కర్‌కు రూ.20 లక్షలు, ఆప్కాస్ ఉద్యోగికి రూ.2 లక్షల బీమా లభిస్తుందన్నారు. అదనంగా ఏడాదికి రూ.2,499 చెల్లిస్తే రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చని, అలాగే ఏడాదికి రూ.6,000 చెల్లిస్తే కుటుంబ సభ్యులంతా రూ.3 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చని వివరించారు.

ఈ బీమా సౌకర్యాలు పొందేందుకు కార్మికులందరూ యాక్సిస్ బ్యాంకు ద్వారా వేతనాలు పొందే విధంగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ తొలి ప్రాధాన్యత ఇస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి నాగప్రసాద్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
  నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...
By Sadaq Sadaq 2026-02-27 00:00:21 0 167
Andhra Pradesh
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
By John Baji 2026-01-02 08:35:33 0 163
Andhra Pradesh
హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి
*రాజమహేంద్రవరం : ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి.*...
By Rajini Kumari 2025-12-20 09:40:43 0 181
Andhra Pradesh
బస్సు ప్రమాదం ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చే సీన బిజెపి ఏపీ అధ్యక్షుడు పివీఎన్
అమరావతి   *బస్సు ప్రమాద ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిజెపి ఎపి అధ్యక్షుడు పివియన్...
By Rajini Kumari 2025-12-12 17:15:44 0 265
Andhra Pradesh
ఆధ్యాత్మిక జెన్Z వాగ్లర్ స్వాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు
దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వాగ్లర్...
By Rajini Kumari 2025-12-23 07:36:40 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com