బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం - కలెక్టర్ 

0
197

బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం . బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించిన విద్యార్థులను అభినందించి. బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు.

బాపట్ల: బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు  డిఇఓ  శ్రీనివాస్  తో కలసి  విద్యార్థులు  జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ, "బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని వీరి కృషి, అంకితభావం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. వృత్తి విద్య ద్వారా భవిష్యత్తులో మరిన్ని  మంచి అవకాశాలు సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తు విద్యార్థులను ప్రశంసించారు.

 డి ఈ ఓ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీలు (State Level Skill Competition 2025-26) డిసెంబర్ 29, 2025న విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగాయి. 10 వృత్తి విభాగాల్లో నిర్వహించిన 
ఈ విజయాలు బాపట్ల జిల్లా విద్యారంగానికి కీర్తి తెచ్చాయని డి ఈ ఓ ఈ సందర్భంగా విజేతలైనకె.అక్షయ,కె.సాయి చరిస్మ్, కె.ఈశ్వరమ్మ,సి హెచ్.వైష్ణవి,పి.ఉన్నవెంకటలక్ష్మి విద్యార్థినిలు అభినందించారు.

ఈ పోటీల్లో ప్రతి విభాగానికి మొదటి స్థానానికి రూ.25,000, రెండవ స్థానానికి రూ.15,000, మూడవ స్థానానికి రూ.10,000 నగదు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ పోటీల్లో బాపట్ల జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచారు. వారి వివరాలు:

స్కూల్: జడ్‌పి హైస్కూల్, మేడరమెట్ల
హెడ్‌మాస్టర్: శ్రీమతి టి. అంజనీ దేవి (సంప్రదింపు: 9492813696)
వృత్తి విభాగం: హెల్త్‌కేర్
వృత్తి శిక్షకురాలు: శ్రీమతి కె. రమ్య లత (సంప్రదింపు: 8106998009)
సాధించిన స్థానం: మొదటి స్థానం
నగదు బహుమతి: రూ.25,000

స్కూల్: ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ (బాలికలు), నక్షత్రనగర్
హెడ్‌మాస్టర్: శ్రీమతి జి. రాగిణి
వృత్తి విభాగం: అగ్రికల్చర్
వృత్తి శిక్షకురాలు: శ్రీ సుద్దపల్లి సిరి వెన్నెల  (సంప్రదింపు: 9553541074)
సాధించిన స్థానం: రెండవ స్థానం
నగదు బహుమతి: రూ.15,000

 గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం. చారులత, వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. సత్యనారాయణ, సంబంధిత హెడ్‌మాస్టర్లు, వృత్తి శిక్షకులు, 

 "మా జిల్లా విద్యార్థులు హెల్త్‌కేర్, అగ్రికల్చర్ విభాగాల్లో రాణించడం సంతోషదాయకం. వీరి విజయం జిల్లా విద్యాశాఖ కృషికి ఫలితం."
గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం. చారులత తన అభినందనలు తెలిపారు: "బాలికలు వృత్తి నైపుణ్యాల్లో రాణిస్తున్నారు. ఈ విజయం బాలికల సాధికారతకు నిదర్శనం."
వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. సత్యనారాయణ మాట్లాడుతూ: "వృత్తి శిక్షణ ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో పోటీ పడుతున్నారు. ఈ విజయాలు మరిన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి."
సంబంధిత హెడ్‌మాస్టర్లు, వృత్తి శిక్షకులు కూడా విద్యార్థుల కృషిని, శిక్షణను కొనియాడారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
By Gitta Raju 2026-04-03 01:06:31 0 201
Andhra Pradesh
తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50...
By Ratna Sekhar 2026-03-05 18:14:19 0 680
Andhra Pradesh
Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్!
Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి...
By Pagadala Venkateswar 2026-02-27 07:14:48 0 104
Andhra Pradesh
మదనపల్లి: కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో ఆదివారం, ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా...
By Pagadala Venkateswar 2026-03-01 09:42:22 0 113
Andhra Pradesh
ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కూటమి నాయకులు కొత్తూరు మురళి
గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మోదుగుల పల్లె పంచాయతీ, బడిగిరెడ్డి పల్లె గ్రామస్తుల...
By Kothuru Murali 2026-04-03 09:54:31 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com