ఆరు విడుతల డీ.ఏ ల బకాయిలను చెల్లించాలి-డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్

0
408

మహబూబాబాద్, కొత్తగూడ, జనవరి 7(భారత్ అవాజ్): మండల విద్యా వనరుల కేంద్రం కొత్తగూడ కార్యాలయంలో MEO గుమ్మడి లక్ష్మీనారాయణచే డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కొత్తగూడ మండల శాఖ డైరీ గోడపత్రిక టేబుల్ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉన్నతమైన ఆలోచనలు కలిగి సామాజిక అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నెల్లుట్ల భాస్కర్ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వo వద్ద బకాయిగా ఉన్న ఆరు విడుతల దినసరీ భత్యాన్ని (D.A ) విడుదల చేయాలని, పిఆర్సి నివేదికను తెప్పించుకొని, పిఆర్సి ని అమలు చేయాలని, రిటైర్ ఉపాధ్యాయులకు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్. విష్ణువర్ధన్ రావు, చాట్ల పోట్టయ్య, వాసం ప్రభాకర్, ఎన్. సుమన్, డి.సుధాకర్, ఏ. కోటేశ్వర్, డి.సరస్వతి, ఈ.ప్రమీల, ఏం. సూరయ్య, టి.బిక్షపతి, బి.రమేష్, యాప.బ్రహ్మయ్య, ఎం రవి, డి.లక్ష్మణ్, బి. వెంకన్న ఓ.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మిషన్ హార్టీ విజన్ తో ఉద్యాన సాగు విస్తరణ
జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం...
By Boiena Rajesh 2026-03-05 14:45:24 0 205
Andhra Pradesh
జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ వార్షికోత్సవాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు
*హైదరాబాద్*   • జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలను...
By Rajini Kumari 2025-12-28 10:17:21 0 187
Telangana
మొయినాబాద్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు వేడుకలు
హిమాయతనగర్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ ఊరేగింపు లో కౌన్సిలర్లు పల్లగోల్ల...
By Veeresh Kumar 2026-03-27 15:05:14 0 395
Andhra Pradesh
మార్చి మూడో తారీకు విలేకరుల సమావేశం జరిగింది
ఈరోజు (03 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2026-03-03 12:15:33 0 165
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:30:54 0 41
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com