మదనపల్లె: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం

0
161

మదనపల్లె మండలం, మాలెపాడు దేవలంపల్లికి చెందిన గణప్రసాద్ (35) కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం తెట్టులో అత్తగారింట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి, రాత్రి దేవలంపల్లికి వచ్చి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com