చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ.|

0
204

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : - జీడిమెట్ల -132 డివిజన్ పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో గాజులరామారం చిత్తారమ్మ దేవాలయం కమిటీ సభ్యులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి జనవరి 23 నుంచి నిర్వహించే చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జాతర సమయంలో గుడి ఆవరణలో వీధి దీపాలతో పాటు ఫ్లడ్ లైట్ ల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అంటువ్యాధులు ప్రబలకుండా గేమాక్సిన్ పౌడర్ చెల్లించడంతోపాటు భక్తులకు వాటర్ ట్యాంకర్లతో మంచినీటిని అందించేలా ఏర్పాట్లు కల్పించాలన్నారు.

 

అనంతరం బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్  మాట్లాడుతూ....

హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జాతర్లలో చిత్తారమ్మ దేవాలయం జాతర ఒకటని, ప్రతి ఏడు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాతరను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేద్దామని, త్వరలోనే అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి జాతర విజయవంతంకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి జాతరను జయప్రదం చేద్దామన్నారు. 

 

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, కమిటీ సభ్యులు నరసింహ, కూన హరి గౌడ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, మాజీ పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: తొలిరోజు 51 మంది గర్హజారి
జిల్లాలో పధోతరగతి పరీక్షలూ ప్రశాంతాంగ ప్రారమ్భమయ్యాయ. తొలి రోజుతెలుగు పరీక్షకు-24-404 మాంధి...
By Sadaq Sadaq 2026-03-14 12:24:55 0 195
Andhra Pradesh
అప్రెంటిస్ ఖాళీలు !!
కర్నూలు :  యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
By Hari Krishna 2025-12-24 14:44:23 0 219
Telangana
ఆ రోడ్డు వేసింది ఎవరో తేల్చండి?.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చివేత, రోడ్డు...
By Ponnala Srinivasrao 2026-03-15 02:41:18 0 304
Andhra Pradesh
విజయవాడలో ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష
ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర...
By Rajini Kumari 2026-03-10 08:46:46 0 187
Telangana
భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది....
By Karapati Gopi 2025-12-30 01:19:10 0 296
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com