చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ.|

0
90

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : - జీడిమెట్ల -132 డివిజన్ పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో గాజులరామారం చిత్తారమ్మ దేవాలయం కమిటీ సభ్యులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి జనవరి 23 నుంచి నిర్వహించే చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జాతర సమయంలో గుడి ఆవరణలో వీధి దీపాలతో పాటు ఫ్లడ్ లైట్ ల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అంటువ్యాధులు ప్రబలకుండా గేమాక్సిన్ పౌడర్ చెల్లించడంతోపాటు భక్తులకు వాటర్ ట్యాంకర్లతో మంచినీటిని అందించేలా ఏర్పాట్లు కల్పించాలన్నారు.

 

అనంతరం బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్  మాట్లాడుతూ....

హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జాతర్లలో చిత్తారమ్మ దేవాలయం జాతర ఒకటని, ప్రతి ఏడు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాతరను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేద్దామని, త్వరలోనే అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి జాతర విజయవంతంకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి జాతరను జయప్రదం చేద్దామన్నారు. 

 

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, కమిటీ సభ్యులు నరసింహ, కూన హరి గౌడ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, మాజీ పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం
 ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది....
By John Baji 2025-12-29 09:07:24 0 54
Telangana
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-07-30 04:16:19 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com