ఆ రోడ్డు వేసింది ఎవరో తేల్చండి?.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

0
240

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చివేత, రోడ్డు నిర్మాణ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిజాంపేటలోని APR ప్రణవ్ యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అధికారులెవరూ రోడ్డు నిర్మించలేదని చెబుతున్నప్పుడు, అక్కడ రోడ్డు ఎలా ప్రత్యక్షమైందని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

‎పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2024లో ప్రహరీ గోడను పాక్షికంగా కూల్చివేసినప్పుడే తాము కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులు పొందామని తెలిపారు. అయితే, ఈ ఏడాది మార్చి 5న అధికారులు నోటీసులు ఇచ్చి, మార్చి 9న అక్రమంగా గోడను కూల్చివేసి రోడ్డు వేశారని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన హెచ్ఎండీఏ తరపు న్యాయవాది.. నిబంధనల ప్రకారం లేఅవుట్ ప్లాన్‌లో ఉన్న రోడ్లను ప్రహరీ గోడలతో అడ్డుకోకూడదని వాదించారు. మరోవైపు, హైడ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తాము అక్కడ ఎలాంటి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని స్పష్టం చేశారు.రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ ఎన్.పి. శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు హెచ్ఎండీఏ, ఇటు హైడ్రా ఇద్దరూ రోడ్డు వేయలేదని చెబుతుంటే, మరి ఆ రోడ్డును ఎవరు నిర్మించారో తేల్చాలని ఆదేశించారు. బాచుపల్లి, జగద్గిరిగుట్ట, దుండిగల్ పోలీస్ స్టేషన్ల అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేశారు.

Search
Categories
Read More
Telangana
పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలుకూరు మండల బేతవోలు గ్రామo సబ్ స్టేషన్ పరిధిలో 21.05.2026 నా చేన్నారి గూడెం, ఆచర్లగూడెం,...
By Nookapangu Manikanta 2026-05-20 12:26:26 0 43
Andhra Pradesh
రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
కర్నూలు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) తెలంగాణ రాష్ట్రం రామగుండం,...
By Hari Krishna 2025-12-23 04:33:52 0 154
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లక్షల్లో మోసం… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి...
By Pagadala Venkateswar 2026-04-21 03:12:24 0 62
Andhra Pradesh
కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు
*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-15 11:37:55 0 171
Ladakh
Ladakh High Court Refuses Bail in Narco‑Terrorism Juvenile Case
On July 16, 2025, the Jammu & Kashmir & Ladakh High Court denied bail to a juvenile...
By Bharat Aawaz 2025-07-17 06:29:24 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com