చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ.|

0
206

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : - జీడిమెట్ల -132 డివిజన్ పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో గాజులరామారం చిత్తారమ్మ దేవాలయం కమిటీ సభ్యులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి జనవరి 23 నుంచి నిర్వహించే చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జాతర సమయంలో గుడి ఆవరణలో వీధి దీపాలతో పాటు ఫ్లడ్ లైట్ ల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా అంటువ్యాధులు ప్రబలకుండా గేమాక్సిన్ పౌడర్ చెల్లించడంతోపాటు భక్తులకు వాటర్ ట్యాంకర్లతో మంచినీటిని అందించేలా ఏర్పాట్లు కల్పించాలన్నారు.

 

అనంతరం బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్  మాట్లాడుతూ....

హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జాతర్లలో చిత్తారమ్మ దేవాలయం జాతర ఒకటని, ప్రతి ఏడు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాతరను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేద్దామని, త్వరలోనే అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి జాతర విజయవంతంకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి జాతరను జయప్రదం చేద్దామన్నారు. 

 

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, కమిటీ సభ్యులు నరసింహ, కూన హరి గౌడ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, మాజీ పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ శ్రేణుల సంబరాలు !!
కర్నూలు :  నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా, పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి...
By Hari Krishna 2025-12-22 11:24:21 0 235
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 4K
Andhra Pradesh
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి.
అన్నమయ్య జిల్లా తంతివారిపల్లెకు చెందిన రఘుపతి (45) అనే జీవిత ఖైదీ హత్య కేసులో 2008లో యావజ్జీవ...
By Pagadala Venkateswar 2026-06-30 07:01:38 0 53
Goa
Goa Strengthens Coastal Surveillance During Monsoon
Goa authorities have intensified coastal surveillance following dangerous sea conditions caused...
By Navya Sree 2026-06-25 08:18:34 0 54
Karnataka
Bengaluru Metro Phase 3: Dispute Over Massive Tree Removal
The upcoming Namma Metro Phase 3 project has run into a major environmental roadblock. The...
By Lokeshwari Panthadi 2026-06-30 08:57:43 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com