ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.

0
171

ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020 సెప్టెంబర్ 2న ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. అయితే విశాఖపట్నం జిల్లా (ప్రస్తుత అనకాపల్లి జిల్లా) కశింకోట మండలంలో కూడా అధికారులు దాడులు చేయగా.. లోటుపాట్లను గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తిని ప్రభుత్వ అనుమతి లేకుండా కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించారని తేలింది. అంతేకాదు మరికొన్ని లోపాలను గుర్తించారు. కశింకోట మండలంలో పనిచేసిన తహసీల్దార్ సుధాకర్.. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఒక ప్రైవేట్ వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించి, వారికి నెలవారీ జీతం కూడా చెల్లించినట్లు విచారణలో తేలింది. ఇది తీవ్రమైన అవినీతి చర్యగా పరిగణించారు.

డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐలు) కూడా హాజరు రిజిస్టర్ నిర్వహణలో, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో, మీసేవ దరఖాస్తులను సకాలంలో ప్రాసెస్ చేయడంలో విఫలమయ్యారు. వారి కార్యాలయాల్లో బీరువాలో, చేతి సంచుల్లో డబ్బుల్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలను బాక్సుల్లో పెట్టి, వాటిని రిజిస్టర్‌లో నమోదు చేయకుండానే ఉంచడం, ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను డౌన్‌లోడ్ కూడా చేసుకోకుండానే గడువు ముగిసే సమయానికి తిరస్కరించడం వంటి నిర్లక్ష్య బయటపడింది

కుల ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ కోసం కూడా అధికారులు డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. రికార్డులను కూడా సరిగా నిర్వహించలేదని గుర్తించారు. ఈ అవకతవకలపై ఆధారాలతో సహా కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం 21 మంది రెవెన్యూ అధికారులు ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసిన తహసీల్దార్ కూడా ఉన్నారు. ఆధారాలతో సహా కేసు నమోదు చేయగా.. తాజాగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు ఆర్‌ఐలు, 14 మంది వీఆర్వోలు, సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వోలు మ్యుటేషన్‌ దరఖాస్తుల్ని పరిశీలించకుండానే తిరస్కరించినట్లు తేలిందట.. అలాగే డబ్బులు డిమాండ్ చేసినట్లు గుర్తించారట.. డబ్బులు ఇవ్వకపోతే దరఖాస్తుల్ని తిరస్కరించారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-05 07:47:40 0 150
Andhra Pradesh
"పీడీఎఫ్" లబ్ధిదారులకు చింతూరు ఐటీడీఏ పీఓ అలర్ట్.
చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గారు ముంపు నిర్వాసితులకు సంబంధించి ఒక...
By Shyamala Yadagiri 2026-04-27 01:13:22 0 203
Telangana
కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన...
By Ponnala Srinivasrao 2026-06-07 01:03:30 0 123
Andhra Pradesh
ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్‌కు 'ఎక్స్' వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు..
ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిమ్మల హేమంత్‌కు 'ఎక్స్' వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు  ...
By Chennaiah Kati 2026-06-11 07:59:27 0 101
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్...
By Boya Dasthagiri 2026-05-20 12:14:20 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com