వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
201

నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి నందవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ గారి వ్యవహార శైలిపై తగిన చర్యలు తీసుకోవాలి అని వివరించడం జరిగింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని నందవరం మండలంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ముఖ్యంగా నందవరం మండలం కనకవీడు గ్రామంలో ఇటీవల జరిగిన ఘటనలో అసలు తప్పు టిడిపి నాయకులదే ఉన్నప్పటికీ, కావాలనే వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వివరించారు.అలాగే మండలంలోని ఏటిగడ్డ ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక, మట్టి తరలింపులు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వైఎస్ఆర్సిపి నాయకులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. మండలం లో బెల్ట్ షాపుల వ్యవహారంపై కూడా తగిన తనిఖీలు నిర్వహించకుండా అలసత్వం వహిస్తున్నారని తెలిపారు.నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ కేసులు, వేధింపులు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగంపై సమగ్రంగా వివరించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, నందవరం సబ్ ఇన్స్పెక్టర్ వారి పై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల ఫారం కార్యదర్శి కనకవీడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మండల సీనియర్ నాయకులు, మండల కన్వీనర్ బి.ఆర్ బసి రెడ్డి గారు, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్ బాషా,చంద్రబాబు, పెద్ద ఈరన్న, గిడ్డయ్య,వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నూతన ITDA PO గా లెనిన్
ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) గా Lenin Vatsal Toppo నియామకం
By Bheeshman King 2026-04-26 00:47:30 0 825
Andhra Pradesh
Putta Mahesh: పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా...
By Pagadala Venkateswar 2026-03-18 06:56:21 0 177
Andhra Pradesh
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు చి. మధు విక్రమ్ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు...
By Chennaiah Kati 2026-07-03 13:03:29 0 44
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లాలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారవేత్తలకు ఉచితంగా గొడుగులు...
By Kothuru Murali 2026-05-11 05:45:12 0 99
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక...
By Chennaiah Kati 2026-01-19 16:41:21 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com