గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ

0
250

కర్నూలు : కర్నూలుజిల్లా...

10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం ... 

అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా . 

గౌరవ ఏపీ  డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి పర్యవేక్షణలో  మంగళవారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి  తగలబెట్టారు. 

ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా   గారు  మాట్లాడుతూ...

ఈ రోజు  కర్నూలు జిల్లా లోని వివిధ పోలీసుస్టేషన్ ల పరిధులలో  27  కేసులలో  స్వాధీనం చేసుకున్న  126 కేజీ ల గంజాయిని   కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న  జిల్లా పోలీసు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో  ఎక్సైజ్  అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ధ్వంసం చేశామన్నారు. 

 పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్  అనుమతితో , NDPS  Act  ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా  ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు. 

దహనం చేసిన గంజాయి విలువ   రూ. 10 లక్షల 33 వేలు ఉంటుందన్నారు. 

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు. 

 ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ సుధీర్ బాబు , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,  ఎక్సైజ్ డిఎస్పీ రామకృష్ణా రెడ్డి,  నోడల్ ఆఫీసర్ సిఐ గుణశేఖర్ బాబు,  సిఐలు తేజమూర్తి, విక్రమసింహ, శేషయ్య, నాగరాజారావు, ఇతర ఎస్సైలు  పాల్గొన్నారు. 


Search
Categories
Read More
Telangana
హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..
పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.. ‎హరీష్ రావును...
By Ponnala Srinivasrao 2026-04-01 03:44:33 0 199
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:10:18 0 3K
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 341
Telangana
నిజామాబాద్:
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
By Sadaq Sadaq 2026-05-13 04:16:07 0 109
Andhra Pradesh
మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు...
By Benguluri Madhubabu 2026-03-21 07:48:47 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com