గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ

0
140

కర్నూలు : కర్నూలుజిల్లా...

10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం ... 

అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా . 

గౌరవ ఏపీ  డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి పర్యవేక్షణలో  మంగళవారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి  తగలబెట్టారు. 

ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా   గారు  మాట్లాడుతూ...

ఈ రోజు  కర్నూలు జిల్లా లోని వివిధ పోలీసుస్టేషన్ ల పరిధులలో  27  కేసులలో  స్వాధీనం చేసుకున్న  126 కేజీ ల గంజాయిని   కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న  జిల్లా పోలీసు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో  ఎక్సైజ్  అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ధ్వంసం చేశామన్నారు. 

 పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్  అనుమతితో , NDPS  Act  ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా  ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు. 

దహనం చేసిన గంజాయి విలువ   రూ. 10 లక్షల 33 వేలు ఉంటుందన్నారు. 

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు. 

 ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ సుధీర్ బాబు , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,  ఎక్సైజ్ డిఎస్పీ రామకృష్ణా రెడ్డి,  నోడల్ ఆఫీసర్ సిఐ గుణశేఖర్ బాబు,  సిఐలు తేజమూర్తి, విక్రమసింహ, శేషయ్య, నాగరాజారావు, ఇతర ఎస్సైలు  పాల్గొన్నారు. 


Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మార్వో గారు నూతనంగా ప్రారంభించన రేషన్ షాప్
పుంగనూరులోని యూబీ కాంపౌండ్‌లో నూతన రేషన్ షాప్ ప్రారంభోత్సవంలో MROతో పాటు టీడీపీ నాయకులు సీవీ...
By Kothuru Murali 2026-01-02 05:20:47 0 76
Goa
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
By Bharat Aawaz 2025-07-17 06:22:44 0 940
Andhra Pradesh
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు
తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న...
By Karapati Gopi 2025-12-31 07:01:34 0 452
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com