గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ

0
211

కర్నూలు : కర్నూలుజిల్లా...

10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం ... 

అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా . 

గౌరవ ఏపీ  డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి పర్యవేక్షణలో  మంగళవారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి  తగలబెట్టారు. 

ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా   గారు  మాట్లాడుతూ...

ఈ రోజు  కర్నూలు జిల్లా లోని వివిధ పోలీసుస్టేషన్ ల పరిధులలో  27  కేసులలో  స్వాధీనం చేసుకున్న  126 కేజీ ల గంజాయిని   కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న  జిల్లా పోలీసు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో  ఎక్సైజ్  అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ధ్వంసం చేశామన్నారు. 

 పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్  అనుమతితో , NDPS  Act  ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా  ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు. 

దహనం చేసిన గంజాయి విలువ   రూ. 10 లక్షల 33 వేలు ఉంటుందన్నారు. 

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు. 

 ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ సుధీర్ బాబు , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,  ఎక్సైజ్ డిఎస్పీ రామకృష్ణా రెడ్డి,  నోడల్ ఆఫీసర్ సిఐ గుణశేఖర్ బాబు,  సిఐలు తేజమూర్తి, విక్రమసింహ, శేషయ్య, నాగరాజారావు, ఇతర ఎస్సైలు  పాల్గొన్నారు. 


Search
Categories
Read More
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 73
Andhra Pradesh
మదనపల్లె రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండకు చెందిన తిరుమల దావీదురాజు (26)...
By Pagadala Venkateswar 2026-04-13 05:37:38 0 72
Andhra Pradesh
జాతీయ పశు ఆరోగ్య శిబిరం రైతులందరూ సద్వినియోగం చేయాలి.
ఈనెల 19 నుంచి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-20 06:20:45 0 146
Andhra Pradesh
మదనపల్లెలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
By Pagadala Venkateswar 2026-01-21 06:49:09 0 136
Telangana
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని...
By Sidhu Maroju 2025-10-21 10:38:28 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com