హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..

0
197

పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్..

‎హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..

‎అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర నీది..

‎మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించిన బుద్ధి రాలేదు..

‎మంత్రి కుమార్తె వివాహం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా..

‎సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది..

‎నీ స్వార్థం కోసం కన్న తల్లిని సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు కదా..

‎మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అమ్ముకున్నది నిజం కాదా..

‎ఎన్నికలు వస్తే నీకు పండగే కదా.. రేటు కట్టి మరీ బీఫాంలు అమ్ముకోవడం మీకు అలవాటే కదా..

‎రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్లికో కలెక్షన్ ఏజెంట్ పెట్టి వసూలు చేయడం అబద్ధమా..

‎గత రెండున్నర సంవత్సరాలలో నీ వసూల్ చిట్టా విప్పమంటావా కాటా. 

‎అమీన్పూర్ సర్పంచ్ గా ప్రజలు నమ్మి గెలిపిస్తే.. రెండేళ్లలో రిమూవ్ అయ్యావు.. గుర్తులేదా..

‎ఒక సర్పంచ్ పదవిని పూర్తి కాలం పనిచేయలేని అసమర్థుడు కాటా శ్రీనివాస్ గౌడ్..

‎నమ్ముకున్న ప్రజల కోసం వందల ఎకరాలు అమ్ముకున్న చరిత్ర నాది..

‎గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే బహిరంగ విచారణకు సిద్ధం..

‎ మైనింగ్ కేసులపై పూర్తి వివరణ

‎2012 లో పటాన్చెరు మండల రెవెన్యూ పరిధిలోని లకడారం గ్రామంలో సర్వే నంబర్ 738 లో సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో No.439/QL/2010 ప్రభుత్వ ప్రొసీడింగ్స్ తో 2012 లో 15 సంవత్సరాల లీజు తో ప్రారంభించడం జరిగింది.

‎మా సంస్థకు క్వారీ కేటాయించిన భూమిలో అప్పటికే ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ జాతీయ రహదారి కోసం పెద్ద ఎత్తున మైనింగ్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఈ విషయాన్ని సంబంధిత మైనింగ్ శాఖ అధికారుల సైతం తెలపడం జరిగింది. అనంతరం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్వారీని నడపడం జరిగింది.

‎2023 సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2024 లో కేవలం రాజకీయ కక్షతో అనుమతికి మించి మైనింగ్ చేస్తున్నారంటూ నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 520 కి క్రషర్ క్వారీలకు సైతం నోటీసులు అందించారు.

‎కేవలం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి క్వారీ అన్న కక్షతో నిబంధనలను తుంగలో తొక్కి.. క్వారీ ప్రతినిధులు లేకుండానే.. అడ్డగోలుగా సర్వే నిర్వహించి 300 కోట్ల రూపాయల జరిమానా విధించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 

‎ఈ అంశంపై ఫిజికల్ గా రీ సర్వే నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టుకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం విజ్ఞప్తి చేయడం జరిగింది.

‎రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసిన.. నేటి వరకు రీ సర్వే చేయలేదంటే దాని వెనక ఎవరు ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవచ్చు.

‎ పటాన్చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం సర్వే నంబర్ 62 లో గల 5 ఎకరాలకు సంబంధించిన పూర్తి వివరాలు. 

‎1. 1974 సంవత్సరంలో వెంకటేశ్వర్లు అనే స్వాతంత్ర సమరయోధుడికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుని కోటా కింద పోచారం పరిధిలోని సర్వే నంబర్ 62లో 5 ఎకరాలు కేటాయించడం జరిగింది.

‎2. 1997 సంవత్సరంలో వెంకటేశ్వరరావు గారు తన ఐదు ఎకరాలను శంకర్ లాల్ గారికి విక్రయించడం జరిగింది. 

‎3. 1998 నుండి శంకర్ లాల్ గారు ఈ ఐదు ఎకరాలను వివిధ వ్యక్తులకు విక్రయించడం జరిగింది. 

‎ఈ భూమికి సంబంధించి మాకు గాని మా కుటుంబ సభ్యుల గాని ఎటువంటి సంబంధం లేదు. మరోసారి ఈ అంశంపై వివాదాస్పద ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.
ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సత్యవేడులో రూ. 2,200 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-05-07 07:03:22 0 92
Telangana
పేద కుటుంబానికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కొలకని నాగ జ్యోతి గారికి ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-07 15:54:30 0 366
Business & Finance
Director Identification Number Registration Made Easy
Director Identification Number (DIN) Registration is mandatory for individuals who wish to become...
By Navya Sree 2026-07-21 06:22:19 0 44
Andhra Pradesh
 216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు
216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్  ...
By Gadiyapudi Narendra 2025-12-24 17:18:07 0 468
Andhra Pradesh
ఆర్ ఎం ఎస్ ర్యాంకును సాధించిన మురళి యూపీ స్కూల్ విద్యార్థిని అభినందించిన సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యూపీ స్కూల్ విద్యార్థి పని రామ వర్మ రాష్ట్రీయ మిలిటరీ...
By Benguluri Madhubabu 2026-03-16 13:11:30 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com