గుంటూరు విద్యార్థులలో మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు. గుంటూరు రేంజ్ ఐడి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు సంకల్ప కార్యక్రమం నీర్వహించారు.

0
401

గుంటూరు జిల్లా పోలీస్...* *30.12.2025* _*// "సంకల్పం" కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు,.//*_ 🚩 గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, సంకల్పం కార్యక్రమం ద్వారా గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ❇️ ఈ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్ నాశనం అవుతుందని, చదువుపై ఏకాగ్రత కోల్పోయి పరీక్షల్లో విఫలమవుతారని, ఉన్నత చదువుల్లో రాణించలేరని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా, వారికి మనోవేదన కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విద్యార్థులకు సూచించారు. ❇️ సరదా కోసం లేదా ఆకతాయి తనంతో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని, మొదట అలవాటుగా మొదలై తరువాత వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. 👉 ఈ అవగాహన కార్యక్రమాలలో * ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ఇతర పోలీస్ అధికారులు KL యూనివర్సిటీ నందు * సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారు, వట్టి చెరుకూరు సీఐ రామా నాయక్ గార్లు మలినేని కాలేజీ, పుల్లడిగుంట మరియు ప్రియదర్శిని కాలేజీ, 5వ మైలు నందు * వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు, ఎస్సై రాంబాబు గార్లు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలని నందు విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ❇️ గుంటూరు జిల్లా పోలీస్ శాఖ యువత భవిష్యత్తును పరిరక్షించడమే లక్ష్యంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు నిరంతరం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం 50 శాతం రిజర్వేషన్ల...
By Sidhu Maroju 2025-09-11 15:03:56 0 265
Andhra Pradesh
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
  Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
By Pagadala Venkateswar 2026-01-26 06:55:46 0 109
Telangana
మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’
ఏడాదంతా టైం పాస్ చేసి.. పరీక్షల టైంలో కొందరు విద్యార్ధులు నానాతంటాలు పడుతుంటారు. పాస్ చేయమని...
By Ponnala Srinivasrao 2026-03-26 01:43:36 0 113
Andhra Pradesh
పీఈటీ పోస్టుల భర్తీకి డిమాండ్: విద్యార్థుల క్రమశిక్షణకు వ్యాయామ విద్య అవసరం.
ఉగాది సందర్భంగా విడుదలైన 2026 జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యలో వ్యాయామ విద్య (physical...
By Pagadala Venkateswar 2026-03-23 04:00:30 0 110
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 234
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com