బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?

0
152

బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?

బాపట్ల: బాపట్ల పట్టణం చీలురోడ్డు సెంటర్ వద్ద, జామ్ జామ్ టీ కొట్టు పక్కనే ఉన్న సైడ్ కాలువ మరోసారి మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. భద్రతా రాళ్లు, కవర్లు లేకుండా వదిలేసిన కాలువలో  వ్యక్తి పడిపోవడం కలకలం రేపింది.

బస్సు వెళ్లిపోతుందన్న తొందరలో ముందున్న డ్రైనేజ్ మీద కాలు పెట్టి వేగంగా వెళ్లే క్రమంలో సమతుల్యం కోల్పోయిన వ్యక్తి నేరుగా సైడ్ కాలువలోకి పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రాణాపాయం సంభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు అపెద్దాయన్ని బయటికి లాగినారు అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాలు దక్కాయి.

అయితే, కాలువలో పడిన అతని మొబైల్ ఫోన్ పూర్తిగా పాడైపోయింది. ఒకవేళ కొద్దిగా ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారేదో ఊహించడానికే ప్రజలు భయపడుతున్నారు.

రోజురోజుకీ మున్సిపాలిటీ నిర్లక్ష్యం పెరుగుతుండటంతో బాపట్ల పట్టణంలోని సైడ్ కాలువలు ప్రజలకు ఉచ్చు పాశాలుగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోయాకే అధికారులు కదలాలా? ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడం ఎందుకు చేతకావడం లేదు?

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువలపై భద్రతా రాళ్లు ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Telangana
ISRO LVM3 M6 Rocket Set for Launch 2025
ISRO successfully launched the LVM3-M6 rocket CES carrying the BlueBird Block-2 satellite, the...
By Yadamma Raju Gajapaga 2025-12-24 12:14:29 0 275
Andhra Pradesh
మదనపల్లెలో C, D గ్రేడ్ విద్యార్థుల 30 రోజుల విద్యా ప్రణాళిక.
అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లి...
By Pagadala Venkateswar 2026-02-10 04:29:19 0 16
Andhra Pradesh
పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి...
By Ratna Sekhar 2026-02-12 08:22:04 0 76
Andhra Pradesh
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా...
By Chennaiah Kati 2026-02-01 07:07:45 0 91
Telangana
మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి పంచాయతీ*
*బిగ్ బ్రేకింగ్*.....      *మీనాక్షి నటరాజ్ దగ్గరికి చేరిన పాలకుర్తి...
By Ellandula Sandeep 2026-01-08 04:28:09 0 147
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com