బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?

0
388

బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?

బాపట్ల: బాపట్ల పట్టణం చీలురోడ్డు సెంటర్ వద్ద, జామ్ జామ్ టీ కొట్టు పక్కనే ఉన్న సైడ్ కాలువ మరోసారి మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. భద్రతా రాళ్లు, కవర్లు లేకుండా వదిలేసిన కాలువలో  వ్యక్తి పడిపోవడం కలకలం రేపింది.

బస్సు వెళ్లిపోతుందన్న తొందరలో ముందున్న డ్రైనేజ్ మీద కాలు పెట్టి వేగంగా వెళ్లే క్రమంలో సమతుల్యం కోల్పోయిన వ్యక్తి నేరుగా సైడ్ కాలువలోకి పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రాణాపాయం సంభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు అపెద్దాయన్ని బయటికి లాగినారు అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాలు దక్కాయి.

అయితే, కాలువలో పడిన అతని మొబైల్ ఫోన్ పూర్తిగా పాడైపోయింది. ఒకవేళ కొద్దిగా ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారేదో ఊహించడానికే ప్రజలు భయపడుతున్నారు.

రోజురోజుకీ మున్సిపాలిటీ నిర్లక్ష్యం పెరుగుతుండటంతో బాపట్ల పట్టణంలోని సైడ్ కాలువలు ప్రజలకు ఉచ్చు పాశాలుగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోయాకే అధికారులు కదలాలా? ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడం ఎందుకు చేతకావడం లేదు?

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువలపై భద్రతా రాళ్లు ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం
*అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం చేసినా కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం*   *అప్పుడు,...
By Rajini Kumari 2025-12-29 13:16:07 0 221
Andhra Pradesh
మాచాని సోమప్ప వర్ధంతి సందర్భంగా బివి జగనేశ్వర్ రెడ్డి గారు నివాళులర్పించారు.
-*దివంగత మాచాని సోమప్ప గారి 48వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప సర్కిల్...
By Boya Dasthagiri 2026-03-30 08:08:13 0 203
Telangana
హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు వినతులు.|
'మాస్టర్ ప్లాన్ రహదారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలు" మేడ్చల్ మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-07-11 08:55:10 0 91
Andhra Pradesh
మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు.
మదనపల్లె జిల్లా కేంద్రంలో రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు...
By Pagadala Venkateswar 2026-02-19 10:01:36 0 162
Andhra Pradesh
Pawan Kalyan: దక్షిణాదిపై జనసేన గురి: 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' లక్ష్యంగా నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ సమరభేరి.
మూడో విడత సభ్యత్వ నమోదుకు జనసేన శ్రీకారం ఏపీ, టీజీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టలలో సభ్యత్వ నమోదు...
By Pagadala Venkateswar 2026-02-26 11:29:00 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com