బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?

0
313

బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?

బాపట్ల: బాపట్ల పట్టణం చీలురోడ్డు సెంటర్ వద్ద, జామ్ జామ్ టీ కొట్టు పక్కనే ఉన్న సైడ్ కాలువ మరోసారి మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. భద్రతా రాళ్లు, కవర్లు లేకుండా వదిలేసిన కాలువలో  వ్యక్తి పడిపోవడం కలకలం రేపింది.

బస్సు వెళ్లిపోతుందన్న తొందరలో ముందున్న డ్రైనేజ్ మీద కాలు పెట్టి వేగంగా వెళ్లే క్రమంలో సమతుల్యం కోల్పోయిన వ్యక్తి నేరుగా సైడ్ కాలువలోకి పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రాణాపాయం సంభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు అపెద్దాయన్ని బయటికి లాగినారు అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాలు దక్కాయి.

అయితే, కాలువలో పడిన అతని మొబైల్ ఫోన్ పూర్తిగా పాడైపోయింది. ఒకవేళ కొద్దిగా ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారేదో ఊహించడానికే ప్రజలు భయపడుతున్నారు.

రోజురోజుకీ మున్సిపాలిటీ నిర్లక్ష్యం పెరుగుతుండటంతో బాపట్ల పట్టణంలోని సైడ్ కాలువలు ప్రజలకు ఉచ్చు పాశాలుగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోయాకే అధికారులు కదలాలా? ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడం ఎందుకు చేతకావడం లేదు?

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువలపై భద్రతా రాళ్లు ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Telangana
మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్
మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్ ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు గాయలు అయ్యాయి ప్రొకలైన్ తో...
By CM_ Krishna 2026-01-23 17:30:22 0 352
Andhra Pradesh
వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు...
By Boiena Rajesh 2026-02-28 11:11:29 0 162
Media Academy
Modern Media & Journalism:
In the rapidly evolving digital age, journalism has undergone a remarkable transformation,...
By Media Academy 2025-05-01 06:17:39 0 3K
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్
అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ...
By Kothuru Murali 2026-05-13 18:42:30 0 49
Andhra Pradesh
ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి...
By Boiena Rajesh 2026-04-04 08:26:01 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com