Pawan Kalyan: దక్షిణాదిపై జనసేన గురి: 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' లక్ష్యంగా నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ సమరభేరి.

0
153

మూడో విడత సభ్యత్వ నమోదుకు జనసేన శ్రీకారం

ఏపీ, టీజీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఉద్యమి, సాధక్, ప్రదాత పేర్లతో మూడు వర్గాలుగా సభ్యత్వాలు

 

రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే లక్ష్యంగా, 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' అనే శక్తిమంతమైన నినాదంతో మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదుకు నేడు జనసేన శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గానికే పరిమితమైన ఈ కార్యక్రమం, నేటి నుంచి విసృత రూపం దాల్చనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు మహారాష్ట్రలోనూ తన ఉనికిని చాటుకోవాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి భారీ స్థాయిలో సభ్యులను చేర్చుకోవడం ద్వారా కేడర్ బలాన్ని ప్రదర్శించాలని అధినేత పవన్ కల్యాణ్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.

 

 

ఈసారి క్రియాశీలక సభ్యత్వ రుసుమును రూ. 500 నుండి రూ. 400కు తగ్గించి సామాన్యులకు మరింత చేరువయ్యే ప్రయత్నాన్ని జనసేన చేస్తోంది. కేవలం సభ్యత్వాలు తీసుకోవడమే కాకుండా, కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు, ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ. 2 లక్షల రూపాయలు, గాయపడితే రూ. 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. వసూలైన సభ్యత్వ రుసుమును పూర్తిగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసమే వినియోగించడం ద్వారా కేడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేస్తోంది.

 

 

 

పార్టీ నిర్మాణంలో క్రమశిక్షణను పెంచేందుకు సభ్యత్వాన్ని ఈసారి మూడు విభిన్న వర్గాలుగా విభజించారు. ఉద్యమి, సాధక్, ప్రదాత అనే పేర్లతో కార్యకర్తల పనితీరు, నిబద్ధత ఆధారంగా ఈ వర్గీకరణ సాగనుంది. ఇప్పటికే గత రెండు విడతల్లో విజయవంతంగా 13 లక్షల మందికి పైగా సభ్యులను నమోదు చేసుకున్న జనసేన, ఈ మూడో విడత ద్వారా రికార్డు స్థాయి సంఖ్యను చేరుకోవాలని భావిస్తోంది. సిద్ధాంతాల ప్రచారం, గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతమే ధ్యేయంగా సాగుతున్న ఈ సభ్యత్వ డ్రైవ్‌ను పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Search
Categories
Read More
Telangana
అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని...
By Sidhu Maroju 2025-06-10 10:34:52 0 1K
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
By Pagadala Venkateswar 2026-01-20 06:18:08 0 177
Andhra Pradesh
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ
విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం...
By Mobbu Venkatramana 2026-03-10 11:22:46 0 286
Telangana
బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో వర్షం
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ అంతలోనే ఆకాశం మేఘావృతం...
By Ponnala Srinivasrao 2026-04-19 12:35:47 0 110
Telangana
హైడ్రా మోడల్‌కు చెన్నై ఫిదా… ₹1200 కోట్ల భూమి స్వాధీనం.|
హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2026-04-08 09:43:55 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com