పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ !!

0
130

కర్నూలు : కర్నూలు సిటీ : 

ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్  ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచిన ... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మరియు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.  

క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని , పోలీసుల విధి నిర్వహణ ఒత్తిడిని ఎదుర్కోనేందుకు  క్రీడలు ఎంతో దోహదపడుతాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారులు తెలిపారు. 

ఈ సంధర్బంగా  ఆదివారం కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  మైదానంలో  సివిల్, ఎఆర్ మరియు ఎపిఎస్పీ  పోలీసులకు నిర్వహించిన  పోలీసు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ను  కర్నూలు జిల్లా ఎస్పీ గారు , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ లు కలిసి  ప్రారంభించారు.  

క్రికెట్ ఆడి సిబ్బందిని  ఉత్సాహపరిచారు. 

జిల్లా సివిల్ , ఎఆర్  పోలీసుల జట్టు కు కెప్టెన్ గా కర్నూలు జిల్లా ఎస్పీ  గారు  వ్యవహరించారు. 

ఎపిఎస్పీ  పోలీసుల జట్టుకు కెప్టెన్ గా ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్  గారు వ్యవహరించారు. 

ఇరు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ టీం గా ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  పోలీసులు ,  రన్నర్ టీం గా కర్నూలు జిల్లా పోలీసులు  గెలుపొందారు. 

ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ...

కర్నూలు జిల్లా పోలీసులకు, కర్నూలు ఎపిఎస్పీ పోలీసులకు ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు .   

శాంతిభధ్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు ఫిట్ నెస్ తో  ఉండడానికి,  మానసిక నూతనోత్సహాన్ని ఇస్తాయన్నారు. 

క్రీడలతో శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు.  గెలుపు , ఓటములు సహజమన్నారు.

 కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ...

మొత్తం సంవత్సరం అంతా బందోబస్తు విధులలో ఉండే పోలీసుల ఒత్తిడిని తగ్గించడానికి, ఫిజికల్ ఫిట్ నెస్  ఉంటూ  ప్రజలకు  మేరుగైన  సేవలందించే ఉద్దేశ్యంతో  పోలీసులు బాగా పని చేయాలని ఈ ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో   కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ లు ఎస్ . ఎం. భాషా, సుధాకర్ రెడ్డి,  వెంకటరమణ,  సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ , ఎస్డీఆర్ ఎఫ్  పోలీసులు  ఉన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలన దేవాదాయ శాఖ కమిషనర్
*సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి*   *-దేవాదాయ శాఖ కమిషనర్...
By Rajini Kumari 2025-12-23 07:51:29 0 103
Andhra Pradesh
విదేశీ అధ్యక్షులను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి అర్చకులు
*దుర్గ గుడిలో ప్రత్యేక* *పూజలు చేసిన*   *మారిషష్ దేశఅధ్యక్షులు* *ధర్మంబీర్*  ...
By Rajini Kumari 2026-01-05 11:43:59 0 104
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: 2 డిపో గౌరవ అధ్యక్షుడిగా దేవేంద్రబాబు ఎన్నిక.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 2 డిపో గౌరవ అధ్యక్షులుగా జోలపాలెం దేవేంద్రబాబు (చిన్ని) ఎన్నికయ్యారు....
By Pagadala Venkateswar 2026-02-08 10:55:03 0 37
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com