దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

0
148

ప్రకటన

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 14:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ మరియు మల్లేశ్వర స్వామి వార్లకు శనివారం ఉదయం పద్మశాలీ ప్రతినిధులు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. రానున్న మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని, మంగళగిరి బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమం నిర్వహించబడింది.

శనివారం ఉదయం 11:25 గంటలకు ఆలయానికి చేరుకున్న సంఘ సభ్యులు, చేనేత కళాకారులు నైపుణ్యంతో రూపొందించిన మంగళగిరి పట్టు వస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంగళగిరి పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు: అవ్వారు శ్రీనివాసరావు, మరియు గూడపాటి వెంకట సరోజినీ దేవి 

జీవీ నాగేశ్వరరావు, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, మోరు స్రావణి, పద్మావతి ఠాకూర్, పనబాక భూలక్ష్మి, పెనుమత్స రాఘవరాజు, సుబ్రహ్మణ్య కుమార్ ఏలేశ్వరపు, సుకాసి సరిత, తంబళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పుల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులు మార్తి రామబ్రహ్మం, వెలగపూడి శంకర్ బాబు హాజరై, స్వామివార్ల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమములో పాల్గొనటం తమకు భాగ్యం కలగడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ డిమాండ్.
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బోగస్ మందులు, మెడికల్ మాఫియాపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)...
By Pagadala Venkateswar 2026-02-14 12:57:07 0 132
Andhra Pradesh
500నోట్లు రద్దు ప్రచారం ‌నిజం లేదు ఆర్.బి.ఐ స్పష్టత
500నోటికి కాలం చెల్లిందని దేశంలో మార్చి నుంచి 500నోట్లు రద్దు కానున్నాయి అన్ని రక రకాల పుకార్లు...
By Karapati Gopi 2026-01-03 01:36:23 0 443
Andhra Pradesh
కొండపల్లి ఐడిఏ డ్రెస్ ఫ్యాక్టరీలో 200 కేజీల ఆల్ట్రా జోల స్వాధీనం
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *కొండపల్లి ఐడిఏ లో డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున...
By Rajini Kumari 2026-03-13 13:50:17 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com