పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ !!

0
211

కర్నూలు : కర్నూలు సిటీ : 

ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్  ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచిన ... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మరియు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.  

క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని , పోలీసుల విధి నిర్వహణ ఒత్తిడిని ఎదుర్కోనేందుకు  క్రీడలు ఎంతో దోహదపడుతాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారులు తెలిపారు. 

ఈ సంధర్బంగా  ఆదివారం కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  మైదానంలో  సివిల్, ఎఆర్ మరియు ఎపిఎస్పీ  పోలీసులకు నిర్వహించిన  పోలీసు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ను  కర్నూలు జిల్లా ఎస్పీ గారు , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ లు కలిసి  ప్రారంభించారు.  

క్రికెట్ ఆడి సిబ్బందిని  ఉత్సాహపరిచారు. 

జిల్లా సివిల్ , ఎఆర్  పోలీసుల జట్టు కు కెప్టెన్ గా కర్నూలు జిల్లా ఎస్పీ  గారు  వ్యవహరించారు. 

ఎపిఎస్పీ  పోలీసుల జట్టుకు కెప్టెన్ గా ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్  గారు వ్యవహరించారు. 

ఇరు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ టీం గా ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  పోలీసులు ,  రన్నర్ టీం గా కర్నూలు జిల్లా పోలీసులు  గెలుపొందారు. 

ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ...

కర్నూలు జిల్లా పోలీసులకు, కర్నూలు ఎపిఎస్పీ పోలీసులకు ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు .   

శాంతిభధ్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు ఫిట్ నెస్ తో  ఉండడానికి,  మానసిక నూతనోత్సహాన్ని ఇస్తాయన్నారు. 

క్రీడలతో శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు.  గెలుపు , ఓటములు సహజమన్నారు.

 కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ...

మొత్తం సంవత్సరం అంతా బందోబస్తు విధులలో ఉండే పోలీసుల ఒత్తిడిని తగ్గించడానికి, ఫిజికల్ ఫిట్ నెస్  ఉంటూ  ప్రజలకు  మేరుగైన  సేవలందించే ఉద్దేశ్యంతో  పోలీసులు బాగా పని చేయాలని ఈ ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో   కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ లు ఎస్ . ఎం. భాషా, సుధాకర్ రెడ్డి,  వెంకటరమణ,  సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ , ఎస్డీఆర్ ఎఫ్  పోలీసులు  ఉన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది : ధర్మవరం సుబ్బారెడ్డి
కర్నూలు : 2025 కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ, రాష్ట్రం అభివృద్ధి...
By Hari Krishna 2025-12-30 16:25:52 0 203
Andhra Pradesh
ఎన్టీ రామారావు కు ఘనంగా నివాళులు అర్పించిన కోడుమూరు ఎమ్మెల్యే !!
కర్నూలు : కోడుమూరు : తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ...
By Hari Krishna 2026-01-18 13:52:07 0 153
Andhra Pradesh
చీరాల పరిసర ప్రాంతాల పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన … ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న సెల్‌ఫోన్ వినియోగం
చీరాల: చీరాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా...
By Gadiyapudi Narendra 2026-02-12 17:18:31 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com