శ్రీ రాజరాజేశ్వరి లలితా సత్సంగ్ నూతన క్యాలెండర్- ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
184

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శ్రీ రాజరాజేశ్వరీ లలితా సత్సంగ్ కమిటీ ఆధ్వర్యంలో తయారు చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ ( కాలమానిని) ఆవిష్కరణ కార్యక్రమం సికింద్రాబాద్ కుమ్మరి గూడ లోని శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయంలో సత్సంగ్ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై క్యాలెండర్ (కాలమానిని) ను ఆవిష్కరణ చేసి లలితా సత్సంగ్ కమిటీ సభ్యులకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు .

క్యాలెండర్ ఆవిష్కరణకు దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద పండితులచే ఘనంగా ఆశీర్వచనం ఇప్పించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ కు స్వాగతం పలికిన వారిలో ఇ.ఓ రవికాంత్, సత్సంగ్ కమిటీ సభ్యులు విజయ లక్ష్మి, రుక్మిణి, అరుణ, టెంపుల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వీరలక్ష్మి, కుమారి, ప్రభావతి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్, శేఖర్ ముదిరాజ్,టెంపుల్ కమిటీ చైర్మన్ లు ప్రభాకర్ యాదవ్, వెంకట్రాజు, తదితరులు ఉన్నారు.

#sidhumaroju

Like
1
Search
Categories
Read More
Telangana
వాడు ఎవరి కొడుకు అయినా వానికి చట్టరీత్యా శిక్ష పబ్లిక్ లో కూడా శిక్ష వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా? ‎కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి...
By Ponnala Srinivasrao 2026-05-10 02:32:05 0 81
Telangana
Goshamahal Osmania Hospital
గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, సీఎం రేవంత్ రెడ్డి...
By Yadamma Raju Gajapaga 2025-12-22 07:40:13 1 625
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ:రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు చెందిన 10 ప్రశ్నాపత్రాలు
పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు శనివారం 10 పబ్లిక్ పరిష ప్రశ్నాపత్రాలు...
By Kothuru Murali 2026-03-08 08:26:53 0 122
Andhra Pradesh
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ...
By Pagadala Venkateswar 2026-01-31 06:19:42 0 125
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్...
By Kothuru Murali 2026-02-06 09:40:56 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com