ఆధ్యాత్మిక జెన్Z వాగ్లర్ స్వాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు

0
90

దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వాగ్లర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అభినందించారు. ఆమె చేస్తున్న సాహస యాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమెకు శ్రీశైలంతోపాటు, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి.. ఆయన చూపిన శ్రద్దకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బైక్ రైడింగ్, బైకులపై తనకున్న ఆసక్తిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచుకున్నారు.

Search
Categories
Read More
Himachal Pradesh
कांगड़ा में टांडा मेडिकल कॉलेज में रोबोटिक सर्जरी सुविधा का उद्घाटन
मुख्यमंत्री #सुखविंदर_सिंह_सुक्खू ने कांगड़ा के #टांडा_मेडिकल_कॉलेज में राज्य की दूसरी...
By Pooja Patil 2025-09-13 06:47:05 0 168
Telangana
ప్రాణాంతకంగా మారుతున్న నిషేధిత చైనా మాంజ.|
  హైదరాబాద్ : పోలీసులు చైనా మాంజాపై ప్రజలకు ఎంత అవగాహన కలిగించినా ఇదే తరహా ఘటనలు జరగడం...
By Sidhu Maroju 2026-01-09 16:17:32 0 95
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ !
కర్నూలు :సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన ...జిల్లా...
By Hari Krishna 2025-12-30 16:31:00 0 152
Andhra Pradesh
రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది
.        రైతుల స‌మ‌స్య‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం...
By Rajini Kumari 2026-01-16 12:53:11 0 76
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com