జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తే ఊరుకోం.|

0
126

 

 

 సికింద్రాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీ వికామిషన్ - గ్రామీణ్ ( వీబీ - జీ - రామ్ - జీ) పేరుతో బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడాన్ని,ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ DCC అధ్యక్షులు దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ MG రోడ్ లోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని, కేంద్రంలోని బి జే పి ప్రభుత్వం జాతిపిత మహాత్మాగాంధీ గారి పట్ల చూపిస్తున్న వివక్షను, ద్వేషాన్ని ఖండించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే దురుద్దేశంతో ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కనీస పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇంతకుముందు ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉందని, నేడు బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ఈ పథకంలో మార్పులు చేపట్టిందని, అలాగే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించాలని చూస్తుందని, కావున ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలలో జరిగిన ధర్నాలు రేపు గ్రామస్థాయి వరకు విస్తరిస్తాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి పాత పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

 ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సికింద్రాబాద్, సనత్ నగర్ ఇంఛార్జ్ లు ఆదం సంతోష్ కుమార్,కోట నీలిమ మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ఆటో బోల్తా ప్రయాణికుడు మృతి.
ఆదివారం అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురం మండలం మొరవపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-09 08:11:22 0 26
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ల పరిశీలన కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస     *అన్న క్యాంటీన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి*...
By Rajini Kumari 2025-12-30 10:40:15 0 90
Andhra Pradesh
బాపట్లలో SAAP లీగ్–2026 జిల్లా స్థాయి చెస్ పోటీలు
బాపట్ల జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (District Sports...
By Gadiyapudi Narendra 2026-02-17 16:12:04 0 31
Telangana
BRS నీ పాతాళానికి తోకటమే ఎన్. టీ. ఆర్ కి నిజమయిన నివాళి: సీఎం
నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్. టీ .ఆర్ వర్థంతి నేపధ్యంలో...
By Krishna Balina 2026-01-19 04:07:35 0 238
Telangana
అరైవ్ అలైవ్ ఇది కేవలం కార్యక్రమం కాదు. ప్రాణ రక్షణ ఉద్యమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ అవాజ్ ప్రతినిధి) తెలంగాణలో ఏటేటా పెరుగుతున్న ప్రమాదాల మృతుల...
By Sidhu Maroju 2026-01-20 06:40:44 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com