మున్సిపల్ ఉద్యోగులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన కమిషనర్

0
194

కర్నూలు : 

ప్రతి ఓటు విలువైనదే..

• కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఒక్క ఓటుతోనే ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపొందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతి ఓటరు బాధ్యతగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శుక్రవారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగులచే కమిషనర్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాక బాధ్యత సైతం అని, మతం, కులం, భాష, ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా, నైతికంగా ఓటు వేయడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని తెలిపారు. ఈ ఏడాది “నా భారత్, నా ఓటు” అనే నినాదంతో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకుని, ప్రతి ఎన్నికలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, సూపరింటెండెంట్లు సుబ్బన్న, మంజూర్ బాష, నాగరాజు, సిబ్బంది షబానా బేగం, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శుగవాసి ప్రసాద్ బాబు కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు
రాయచోటి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి...
By Benguluri Madhubabu 2026-02-24 05:36:47 0 209
Rajasthan
Massive TB Screening Campaign Flags 2.3 Lakh Suspected Cases
As part of a statewide campaign launched on June 25, Rajasthan health teams have screened 44% of...
By Bharat Aawaz 2025-07-17 07:20:42 0 1K
Madhya Pradesh
Dhar Water Crisis: Women Brave 50-Foot Ravine
Despite ₹430 crore spent on pipeline infrastructure in Dhar district, a severe drinking water...
By Tejaswini Komanduru 2026-06-15 08:33:38 0 128
Media Academy
The Power Of Truth In An Age Of Misinformation
The Power Of Truth In An Age Of Misinformation In An Era Of Information Overload And...
By Media Academy 2025-04-28 18:35:58 0 4K
Telangana
అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా...
By Lakavath Kiran 2026-03-14 15:44:58 0 502
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com