కొత్తబస్తీకి కల్వర్టు- 45 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.|

0
205

 

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 190 డివిజన్ కొత్త బస్తీ వాసుల జీవితాల్లో ఈ రోజు ఒక గుర్తుండిపోయే రోజు. గత 45 సంవత్సరాలుగా రైల్వే కల్వర్టు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో రూ.1.40 కోట్లతో రైల్వే కల్వర్టు మంజూరైంది.

ఈ శుభవార్త నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెలిమెల మహేష్ ఆధ్వర్యంలో కొత్త బస్తీ వాసులు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

వర్షాకాలంలో నీటి సమస్యలు, రాకపోకల ఇబ్బందులు, అత్యవసర పరిస్థితుల్లో ఎదురయ్యే కష్టాలు ఇక ముగిశాయని బస్తీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

రైల్వే జనరల్ మేనేజర్ ని పలుమార్లు కలిసి సమస్యను వివరించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే చొరవ వల్లే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జావేద్, ప్రశాంత్ రెడ్డి, మొహమ్మద్ మక్బూల్, మొహమ్మద్ ముక్తార్, సలీం, అజార్ మొహమ్మద్, సలీం తదితరులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం !!
కర్నూలు : పోలీస్ శాఖ లో క్రమశిక్షణ నే ప్రధానం : కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ : ...
By Hari Krishna 2025-12-23 02:16:31 0 236
Business & Finance
Start Your Producer Company in India
Register your Producer Company online in India with professional guidance and end-to-end support....
By Navya Sree 2026-07-08 12:25:19 0 56
Business & Finance
GST Rates on Goods for Accurate Tax Compliance
GST rates on goods determine the applicable tax on products sold in India under the Goods and...
By Navya Sree 2026-07-24 06:17:12 0 18
Telangana
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
By Pinnehasan Odela 2026-02-04 07:42:46 0 286
Andhra Pradesh
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం..
బాపట్ల: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం. బాపట్ల చేపల మార్కెట్లో  చాపల...
By Gadiyapudi Narendra 2026-01-20 12:00:48 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com