అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!

0
210

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేరళ రాజభవన్ కు చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులకు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గవర్నర్‌కు రాఘవేంద్ర స్వామి మఠం తరపున శేష వస్త్రం, జ్ఞాపిక , పలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట శ్రీమఠం ప్రత్యేక అధికారి కృష్ణ కౌశిక్ ఆచార్, రాజా అప్రమేయ ఆచార్, వేద పండితులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*అమరావతి*   *ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని...
By Rajini Kumari 2025-12-23 09:39:15 0 260
Andhra Pradesh
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
By mahaboob basha 2025-06-10 00:32:55 0 1K
Telangana
Chaitanyapuri Prabath nagar community hall
ఈ రోజు ప్రభాత్ నగర్ కాలనీ లోని మాధవ్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ను పోలీసులు ఫోర్స్ తో హ్యాండ్ ఓవర్...
By G k Nookala 2026-03-11 12:42:01 0 99
Andhra Pradesh
భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విద్యుత్ ను పొదుపుగా వాడాలి
శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన ఇళ్ల గణన ఫీల్డ్ ట్రైనర్ ట్రైనింగ్ కార్యక్రమంలో...
By Manda Ramkumar 2026-03-28 08:51:50 0 132
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com