అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ మఠం పీఠాధిపతి!!
Posted 2025-12-21 09:14:39
0
266
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ధార్మిక పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతిని ఘనంగా సత్కరించారు. అనంతరం కేరళ రాజభవన్ కు చేరుకున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులకు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గవర్నర్కు రాఘవేంద్ర స్వామి మఠం తరపున శేష వస్త్రం, జ్ఞాపిక , పలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట శ్రీమఠం ప్రత్యేక అధికారి కృష్ణ కౌశిక్ ఆచార్, రాజా అప్రమేయ ఆచార్, వేద పండితులు ఉన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కరెంటు షాక్ తో రెండు ఏనుగులు మృతి
తిరుపతి ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని...
సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా – ఈ నెల 20న 650కి పైగా ఉద్యోగాలు
చీరాల, మార్చి 17: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
గ్రామీణ ప్రాంతాల్లో శాంతి కమిటీ సమావేశాలు
ఆర్టికల్: గ్రామీణ ప్రాంతాల్లో అశాంతిని నివారించేందుకు నిన్న పోలీసులు శాంతి కమిటీలతో...
Lakshadweep Boosts Women’s Livelihood and Empowerment
Lakshadweep continues to strengthen women’s empowerment through livelihood promotion, skill...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈటల, మల్లారెడ్డి.. కారణం ?
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం...