వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...
వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం*
భారత్ అవాజ్ న్యూస్:15 జూన్ రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంగ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార (టిఫిన్) పథకాన్ని ఉదయం 8 గంటలకు ఘనంగా ప్రారంభించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు గౌడ్ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాటేటి రవి వార్డు సభ్యులు మంద పరిమిల అనిల్ గుండెబోయిన రాజు ఇటుకల మౌతిక్ గుజిలే రమ శ్రీను నాంపల్లి రాజయ్య పొగాకు దివ్య బాలకృష్ణ అధత్సండా లక్ష్మి రాజు హెడ్మాస్టర్ సుభాషిని శ్రీవిద్య సృజన రవి తదితరులు పాల్గొన్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz