జాతీయ రోరల్ స్కేటింగ్ విజేతలను అభినందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
169

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   ఈనెల 5 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విశాఖపట్నం లో నిర్వహించిన (7-20 ఏజ్ గ్రూప్) 63 వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 38 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు 19 బంగారు,10 రజిత, 9 కాంస్య పతకాలను సాధించారు .

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం విద్యార్ధినీ,విద్యార్థులను జింఖానా గ్రౌండ్ లో కలిసి అభినందించారు . 

అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ వారితో కంటోన్మెంట్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకు వచ్చారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుని నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు . 

ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధులకు నిరంతరం వెన్నంటి నిలిచిన వారి కోచ్ అనూప్ కుమార్ ను ఎమ్మెల్యే  ప్రత్యేకంగా అభినందించారు.స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం తగిన మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. 

#Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
టెన్త్ పరీక్షా కేంద్రాల తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ నారాయణరావు సోమవారం...
By Boiena Rajesh 2026-03-16 14:19:18 0 154
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు
ప్రకటన: మార్చి 07, 2026 విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో...
By Rajini Kumari 2026-03-06 10:56:24 0 125
Andhra Pradesh
గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...
కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి...
By BABJI DADALA 2025-12-23 14:28:21 0 331
Andhra Pradesh
ఆయి శెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
గుంటూరు నగరంలోని నెహ్రు నగర్56వ డివిజన్ కార్పొరేటర్ ఆయి శెట్టి కనకదుర్గ శ్రీనివాస్ మార్కెట్...
By John Baji 2025-12-31 01:40:03 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com