జాతీయ రోరల్ స్కేటింగ్ విజేతలను అభినందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
146

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   ఈనెల 5 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విశాఖపట్నం లో నిర్వహించిన (7-20 ఏజ్ గ్రూప్) 63 వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 38 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు 19 బంగారు,10 రజిత, 9 కాంస్య పతకాలను సాధించారు .

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం విద్యార్ధినీ,విద్యార్థులను జింఖానా గ్రౌండ్ లో కలిసి అభినందించారు . 

అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ వారితో కంటోన్మెంట్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకు వచ్చారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుని నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు . 

ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధులకు నిరంతరం వెన్నంటి నిలిచిన వారి కోచ్ అనూప్ కుమార్ ను ఎమ్మెల్యే  ప్రత్యేకంగా అభినందించారు.స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం తగిన మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. 

#Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాస రావుకు ఘన నివాళులు అర్పించింది. లాస్...
By Ponnala Srinivasrao 2026-03-17 03:46:41 0 198
Andhra Pradesh
పుంగనూరు: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న...
By Kothuru Murali 2026-03-03 11:54:59 0 76
Andhra Pradesh
ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ...
By Pagadala Venkateswar 2026-03-05 06:45:17 0 84
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com